దొంగ చేతివేలు కొరికేసిన మహిళ
ఉత్తర్ప్రదేశ్లోని కౌశాంబి జిల్లా కరారి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళ దొంగకు చుక్కలు చూపించింది. నీతాదేవి, శ్రీచంద్ దంపతులు మయోహర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు.
ఉత్తర్ప్రదేశ్లోని కౌశాంబి జిల్లా కరారి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళ దొంగకు చుక్కలు చూపించింది. నీతాదేవి, శ్రీచంద్ దంపతులు మయోహర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం నీతాదేవి కూరగాయల కోసం బజారుకు వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమెను వెంబడించిన ఓ దొంగ నిర్మానుష్య ప్రదేశం వచ్చేసరికి అమాంతం దాడి చేశాడు. నీతాదేవి గట్టిగా అరవడంతో తన చేత్తో ఆమె నోరు మూశాడు. దొంగ చేతివేళ్లను ఆమె గట్టిగా కొరకడంతో ఒక చేతి వేలు తెగిపోయింది. ఇంతలో చుట్టుపక్కల జనం అక్కడికి చేరుకునేసరికి దొంగ అందినంత దోచుకొని పారిపోయాడు. దొంగ చేతివేలుతో నీతాదేవి పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. బంగారు గొలుసు, ఓ కాలి పట్టీ, రూ.4 వేల నగదుతో దొంగ ఉడాయించినట్లు ఆమె పేర్కొంది. నీతాదేవి ధైర్యాన్ని మెచ్చుకొన్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా