దొంగ చేతివేలు కొరికేసిన మహిళ
ఉత్తర్ప్రదేశ్లోని కౌశాంబి జిల్లా కరారి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళ దొంగకు చుక్కలు చూపించింది. నీతాదేవి, శ్రీచంద్ దంపతులు మయోహర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు.
ఉత్తర్ప్రదేశ్లోని కౌశాంబి జిల్లా కరారి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళ దొంగకు చుక్కలు చూపించింది. నీతాదేవి, శ్రీచంద్ దంపతులు మయోహర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం నీతాదేవి కూరగాయల కోసం బజారుకు వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమెను వెంబడించిన ఓ దొంగ నిర్మానుష్య ప్రదేశం వచ్చేసరికి అమాంతం దాడి చేశాడు. నీతాదేవి గట్టిగా అరవడంతో తన చేత్తో ఆమె నోరు మూశాడు. దొంగ చేతివేళ్లను ఆమె గట్టిగా కొరకడంతో ఒక చేతి వేలు తెగిపోయింది. ఇంతలో చుట్టుపక్కల జనం అక్కడికి చేరుకునేసరికి దొంగ అందినంత దోచుకొని పారిపోయాడు. దొంగ చేతివేలుతో నీతాదేవి పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. బంగారు గొలుసు, ఓ కాలి పట్టీ, రూ.4 వేల నగదుతో దొంగ ఉడాయించినట్లు ఆమె పేర్కొంది. నీతాదేవి ధైర్యాన్ని మెచ్చుకొన్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్టు ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
-
General News
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5వేల అప్రెంటిస్ ఖాళీలు.. స్టైఫండ్ ఎంతంటే?
-
Movies News
Social Look: కొత్త స్టిల్స్తో సమంత ప్రచారం.. ఈషారెబ్బా శారీ స్టోరీ!
-
General News
CM Jagan: ‘గోరుముద్ద’ మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు: సీఎం జగన్
-
India News
Amritpal Singh: ‘80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు?’.. అమృత్పాల్ పరారీపై న్యాయస్థానం ఆగ్రహం
-
Politics News
Srinivas Goud: పారిపోయినోళ్లను వదిలేసి మహిళపైనా మీ ప్రతాపం?: శ్రీనివాస్గౌడ్