Punjab: చేతులతో నాలుగు బుల్లెట్‌ బైక్‌లను ఆపిన యువకుడు

పంజాబ్‌ లూధియానా జిల్లాలోని ఖిలా రాయ్‌పుర్‌లో జరుగుతున్న గ్రామీణ క్రీడాపోటీల్లో యువకులు సత్తా చాటుతున్నారు.

Updated : 07 Feb 2023 16:15 IST

పంజాబ్‌ లూధియానా జిల్లాలోని ఖిలా రాయ్‌పుర్‌లో జరుగుతున్న గ్రామీణ క్రీడాపోటీల్లో యువకులు సత్తా చాటుతున్నారు. ఈ సందర్భంగా లవ్‌దీప్‌ సింగ్‌ (24) అనే వ్యక్తి.. బుల్లెట్‌ బైక్‌లకు తాళ్లు కట్టి వాటిని ముందుకు పోకుండా ఆపి ఔరా అనిపించాడు. తనకు ఇరువైపులా రెండేసి చొప్పున ద్విచక్రవాహనాలను ఉంచి వాటికి కట్టిన తాళ్లను చేతులకు తగిలించుకున్న లవ్‌దీప్‌.. ద్విచక్ర వాహనాలను స్టార్ట్‌ చేయాలని యువకులకు సూచించాడు. వారు గేర్‌ వేసి రైజ్‌ చేసినప్పటికీ.. బుల్లెట్లు ముందుకు కదలలేదు. తాను కొన్నేళ్లుగా ఈ క్రీడల్లో పాల్గొంటున్నట్లు లవ్‌దీప్‌ చెప్పాడు. మరోవైపు, ఇదే క్రీడల్లో ఫరీద్‌కోట్‌ జిల్లాకు చెందిన జగ్దీప్‌ సింగ్‌ అనే 36ఏళ్ల వ్యక్తి.. పళ్లతో ఏకంగా కారునే లాగేశాడు. ప్రయాణికుల బరువుతో కలిపి 500 కిలోలు ఉన్న మారుతీ కారుకు తాడు కట్టి కొద్దిదూరం వరకు లాక్కెళ్లాడు. జగ్దీప్‌ సాహసాన్ని చూసి వీక్షకులు చప్పట్లతో అభినందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని