సంక్షిప్త వార్తలు(8)
మహిళా నిందితులు, ఖైదీలకు కన్యత్వ పరీక్ష నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం, లింగవివక్షతో కూడిన వ్యవహారమే కాకుండా అమానుష వైఖరికి నిదర్శనమని దిల్లీ హైకోర్టు మంగళవారం వెల్లడించింది.
మహిళా నిందితుల కన్యత్వ పరీక్ష రాజ్యాంగ విరుద్ధం దిల్లీ హైకోర్టు వెల్లడి
దిల్లీ: మహిళా నిందితులు, ఖైదీలకు కన్యత్వ పరీక్ష నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం, లింగవివక్షతో కూడిన వ్యవహారమే కాకుండా అమానుష వైఖరికి నిదర్శనమని దిల్లీ హైకోర్టు మంగళవారం వెల్లడించింది. కన్యత్వ పరీక్ష పేరిట చట్టంలోనూ ఎలాంటి ప్రక్రియ లేదని స్పష్టం చేసింది. 1992లో కేరళలో జరిగిన సిస్టర్ అభయ హత్యకేసుకు సంబంధించి తనపై నమోదైన క్రిమినల్ కేసులో కన్యత్వ పరీక్ష నిర్వహించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సిస్టర్ సెఫీ దాఖలు చేసిన పిటిషను విచారణ సందర్భంగా జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ రకమైన పరీక్ష రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించే గౌరవ హక్కుకు భంగమే’’ అని న్యాయమూర్తి తెలిపారు. విచారణలో భాగంగా 2008లో సీబీఐ తనకు బలవంతంగా కన్యత్వ పరీక్ష చేయించిందని, ఆ పరీక్ష ఫలితాలు కూడా వెల్లడి చేశారని పిటిషనరు కోర్టు దృష్టికి తెచ్చారు. మహిళలకు రెండు వేళ్లతో జరిపే కన్యత్వ పరీక్ష వారి గౌరవానికి, గోప్యతకు భంగకరమని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆక్షేపణ తెలిపిందని, న్యాయస్థానాలకు రెండు రకాల దృక్పథాలు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది.
పక్షవాతం సోకిన శునకానికి పుట్టినరోజు వేడుకలు
ఉత్తర్ప్రదేశ్ మేరఠ్లో పక్షవాతం సోకిన ఓ శునకానికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగా నగర్ ప్రాంతానికి చెందిన సోనియా గౌతమ్ ఈ వేడుకలు జరిపించారు. ఈ కుక్కను ఇంటికి తీసుకుని వచ్చి కల్లూ అని పేరు పెట్టామని, అప్పటి నుంచి అదృష్టం కలిసి వచ్చిందని పారామిలిటరీలో పనిచేసే సోనియా చెప్పారు. కల్లూ పుట్టినరోజు సందర్భంగా వీధి శునకాలకు ప్రత్యేకంగా ఆహారం సిద్ధం చేసి వాటికి అందించారు. ఆమె ఇంట్లో దాదాపు రెండు డజన్ల జంతువులను పెంచుతున్నారు. వాటిలో చాలా కుక్కలు వైకల్యంతో బాధపడుతున్నాయి. గత ఐదేళ్లుగా రోడ్లపై ఉండే జంతువులకు సోనియా ఆహారం అందిస్తున్నారు. ఇలాంటి జంతువుల కోసం ఆసుపత్రి నిర్మించి మెరుగైన వైద్యం అందించడమే తన లక్ష్యం అని ఆమె వెల్లడించారు.
త్వరగానే విచారణ చేపడతాం
బిల్కిస్ బానోకు సుప్రీంకోర్టు హామీ
దిల్లీ: గుజరాత్ అల్లర్ల (2002) సందర్భంగా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, తన కుటుంబసభ్యులను హత్య చేసిన నిందితులకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్పై కొత్త ధర్మాసనం ఏర్పాటుచేసిన వెంటనే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ జస్టిస్ జె.బి.పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం.. త్వరలోనే కొత్త ధర్మాసనం ఏర్పాటుచేస్తామని బానో తరఫున హాజరైన న్యాయవాది శోభా గుప్తాకు హామీ ఇచ్చింది. తమ అభ్యర్థనపై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసిన గుప్తా.. ఈ అంశం విచారణ నుంచి జస్టిస్ బేలా ఎం త్రివేదీ వైదొలగినందున సీజేఐ కొత్త ధర్మాసనం ఏర్పాటుచేయాల్సి ఉందని ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. దీంతో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కల్పించుకుని ‘‘వీలైనంత త్వరగా ఏర్పాటుచేస్తాం. ఈ కేసు వీలైనంత త్వరగా లిస్ట్ అవుతుంది’’ అని చెప్పారు. వాస్తవానికి గత నెల 24న బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సి.టి.రవికుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ న్యాయమూర్తులు ఇద్దరూ అనాయాస మరణానికి సంబంధించిన మరో పిటిషన్ని విచారిస్తున్న అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నందున ఆ రోజున బానో పిటిషన్పై విచారణ జరపడం వీలుపడలేదు.
ఉద్యోగాల హామీ ఏమైంది?
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆరాటపడొద్దని యువతకు ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ సూచిస్తున్నారు. మరి ప్రైవేటు ఉద్యోగాలు ఎక్కడున్నాయి భాగవత్ గారూ? ఇంతకీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోదీ ఇచ్చిన హామీ ఏమైంది?
కపిల్ సిబల్
విద్యకు అత్యుత్తమ గమ్యస్థానమవ్వాలి
భారత్కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. చదువు కోసం ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులను మన దేశానికి ఆకర్షించే సామర్థ్యాన్ని ఇప్పటికే మనం సముపార్జించుకొని ఉండాల్సింది. కానీ ప్రస్తుతం మన యువతే విద్య కోసం విదేశాల బాటపడుతోంది. వైద్య విద్యను అభ్యసించేందుకు మనవాళ్లు ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్తుండటం బాధాకరం. చదువుకు అత్యుత్తమ గమ్యస్థానంగా అవతరించే సామర్థ్యం భారత్కు ఉంది.
అరవింద్ కేజ్రీవాల్
సమర్థ నాయకత్వం భారత్ సొంతం
శాంతి పరిరక్షణకు, వివాదాల పరిష్కారానికి సమర్థ నాయకత్వం అత్యంత కీలకం. బుద్ధుడి రూపంలో ఆధ్యాత్మిక నాయకత్వం, మహాత్మా గాంధీ రూపంలో సామాజిక నాయకత్వం, నరేంద్ర మోదీ రూపంలో బలమైన రాజకీయ నాయకత్వం భారత్కు లభించాయి.
తేజస్వీ సూర్య
సామాజిక మాధ్యమాలతో బూటకపు వార్తల ముప్పు
నకిలీ సమాచారం, బూటకపు వార్తల వ్యాప్తికి సామాజిక మాధ్యమాలు అనువైన వేదికగా మారే అవకాశముంది. వేర్పాటువాద భావజాలాన్ని పెంపొందించేందుకు ఈ మాధ్యమాలను తీవ్రవాద సంస్థలు ఉపయోగించుకునే ముప్పుంది. ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఐరాస అభివృద్ధి కార్యక్రమం
వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ.. మాక్డ్రిల్ నిర్వహించొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు
ముంబయి: ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ మాక్ డ్రిల్ నిర్వహించవద్దని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ మహారాష్ట్ర పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మాక్ డ్రిల్లో వేషధారణలు, వారు చేసే నినాదాలు ఉగ్రవాదులు ముస్లింలని తెలిపేలా ఉన్నాయని అభ్యంతరం చెబుతూ సామాజిక కార్యకర్త సయ్యద్ ఉసామా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ మంగేష్, జస్టిస్ ఎ.ఎస్.చాపల్గౌవాంకార్లతో కూడిన డివిజన్ బెంచ్ ఫిబ్రవరి 3న నిర్వహించిన మాక్ డ్రిల్కు సంబంధించిన మార్గదర్శకాలు కోర్టుకు తెలియజేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది. తరువాత విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. ఇటీవల పోలీసులు అహ్మద్నగర్, చంద్రాపూర్, ఔరంగాబాద్ జిల్లాల్లో మాక్డ్రిళ్లు చేపట్టారు.
అగస్టా కుంభకోణంలో నిందితుడికి బెయిలు నిరాకరణ
దిల్లీ: అగస్టా-వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో దళారిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిలు నిరాకరించింది. అత్యంత ప్రముఖుల (వీవీఐపీ) కోసం రూ.3,600 కోట్లతో 12 అగస్టా-వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి జేమ్స్పై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు విడివిడిగా కేసులు పెట్టి దర్యాప్తు జరుపుతున్నాయి. ఈ కేసులో తనకు విధించగల గరిష్ఠ జైలు శిక్షలో ఇప్పటికే సగం కాలాన్ని పూర్తిచేసినందున బెయిలు ఇప్పించాలంటూ జేమ్స్ పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. అయితే, ట్రయల్ కోర్టులో బెయిలు కోసం ప్రయత్నించడానికి అనుమతించింది.
ముంబయి విమానాశ్రయానికి ఉగ్ర బెదిరింపులు
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం రాత్రి ఉగ్ర బెదిరింపులు వచ్చాయి. ఫోన్ చేసిన వ్యక్తి తాను ఇండియన్ ముజాహిద్దీన్లోని సభ్యుడు ఇర్ఫాన్ అహ్మద్ షేక్గా చెప్పుకొన్నాడు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు ముంబయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విమానాశ్రయ ఏజెన్సీలతోపాటు ముంబయి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తును మొదలుపెట్టారు. ఈ నెల 10న ప్రధాని మోదీ నగరానికి రానున్న నేపథ్యంలో బెదిరింపులు రావడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. సోమవారం నుంచి భద్రతా ఏర్పాట్లను మొదలు పెట్టిన అధికారులు.. డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు విధించారు.
త్వరలో దాభోల్కర్ హత్య కేసు విచారణ ముగింపు
బొంబాయి హైకోర్టుకు తెలిపిన సీబీఐ
నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని వినతి
ముంబయి: హేతువాది దాభోల్కర్ హత్య కేసు విచారణ రెండు, మూడు నెలల్లో ముగుస్తుందని, ఈ నేపథ్యంలో నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని బొంబాయి కోర్టును మంగళవారం సీబీఐ అభ్యర్థించింది. మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి స్థాపకుడైన నరేంద్ర దాభోల్కర్(67)ను పుణెలో 2013 ఆగస్టులో సనాతన్ సంస్థ అనే అతివాద గ్రూప్ సభ్యులు కాల్చి చంపారు. 2014లో కేసును సీబీఐకి అప్పగించగా... వీరేంద్ర సిన్హ తావ్డే, సచిన్ అందురె, శరద్ కలస్కర్, విక్రం భావె, సంజీవ్ పునలేకర్(న్యాయవాది) అనే అయిదుగురిపై అభియోగపత్రం దాఖలు చేసింది. 2021 అక్టోబరులో విచారణ మొదలైంది. వీరిలో బెయిల్పై బయటకు వచ్చిన పునలేకర్ సాక్ష్యాలను ధ్వంసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మిగతా నలుగురిపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో... 2016లో అరెస్టై, ఏడేళ్లుగా జైలులో ఉంటున్నానని, కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున తనకు బెయిల్ ఇవ్వాలని తావ్డే హైకోర్టును ఆశ్రయించారు. కేసు జస్టిస్ ఏఎస్ గడ్కరి, జస్టిస్ పీడీ నాయక్లతో కూడిన ధర్మాసనం ఎదుటకు వచ్చింది. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వాదనలు వినిపిస్తూ... ‘‘పుణెలోని విచారణ కోర్టులో ఇప్పటికే 15 మంది సాక్షుల విచారణ ముగిసింది. మరో ఏడెనిమిది మందిని విచారించాల్సి ఉంది. విచారణ రెండు, మూడు నెలల్లోనే ముగుస్తుంది’’ అని వివరించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ... బెయిల్ పిటిషన్కున్న అర్హతల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!