తోపుడుబండిపై తండ్రిని ఆసుపత్రికి.. ఏడేళ్ల బాలుడి దీనస్థితి

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని అతడి భార్య, ఏడేళ్ల కుమారుడు.. తోపుడుబండిపై ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Updated : 13 Feb 2023 09:43 IST

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని అతడి భార్య, ఏడేళ్ల కుమారుడు.. తోపుడుబండిపై ఆసుపత్రికి తీసుకెళ్లారు. తమ ప్రాంతానికి అంబులెన్స్‌ రాకపోవడం వల్ల మూడు కిలోమీటర్లు.. బండిని తోసుకుంటూ ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడని, 20 నిమిషాలైనా అంబులెన్స్‌ రాలేదని స్థానికులు చెబుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు