BBC: బీబీసీపై ఐటీ కన్ను
గోధ్రా మారణకాండ వెనుక అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ప్రమేయం ఉందంటూ వివాదాస్పద డాక్యుమెంటరీని ఇటీవల ప్రసారం చేసిన ‘బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్’ (బీబీసీ)పై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దృష్టి సారించింది.
దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో సోదాలు
పన్ను ఎగవేత అనుమానాలతో వివరాల ఆరా
ల్యాప్టాప్లు, మొబైళ్ల స్వాధీనం
మోదీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్నాళ్లకే చర్య!
తప్పుపట్టిన విపక్షం, ఎడిటర్స్ గిల్డ్, పాశ్చాత్య మీడియా సంస్థలు
దిల్లీ, లండన్: గోధ్రా మారణకాండ వెనుక అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ప్రమేయం ఉందంటూ వివాదాస్పద డాక్యుమెంటరీని ఇటీవల ప్రసారం చేసిన ‘బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్’ (బీబీసీ)పై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దృష్టి సారించింది. ఆ సంస్థ.. పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో ముంబయి, దిల్లీల్లోని కార్యాలయాల్లో మంగళవారం సోదాలకు దిగింది. సిబ్బంది ఫోన్లన్నింటినీ ఒకచోట ఉంచాల్సిందిగా సూచించి, కొన్ని వివరాల సేకరణకు ప్రయత్నించింది. గుజరాత్ అల్లర్లలో మోదీ హస్తం ఉందని ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరిట రెండు భాగాలుగా ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీలో బీబీసీ పేర్కొంది. అల్లర్లపై న్యాయస్థానాల్లో మోదీకి క్లీన్చిట్ లభించాక ఇలా అభాండాలు వేయడమేమిటని భాజపా అభ్యంతరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ లింకుల్ని సామాజిక మాధ్యమాల్లో నిషేధించింది. ఈ పరిణామాల నడుమ ఐటీ రంగంలోకి దిగడంపై రాజకీయ పార్టీలు, పాత్రికేయ సంఘాల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థల్ని ఉసిగొల్పడం రివాజేననేది మరోసారి రుజువైందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. భాజపా మాత్రం ఈ వాదనను తోసిపుచ్చింది.
సోదాలు కావు.. సర్వేలే: ఐటీ శాఖ
ఉదయం 11 గంటలకు దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాలకు ఐటీ అధికారులు చేరుకున్నారు. లండన్లోని ప్రధాన కార్యాలయంతోపాటు మన దేశంలోని కార్యాలయాల వ్యాపార లావాదేవీల పత్రాల కోసం ఆరా తీశారు. బీబీసీ అనుబంధ కంపెనీల పన్ను వివరాలపై దృష్టిపెట్టారు. ఇది పూర్తిగా బీబీసీ వ్యాపార లావాదేవీలకు సంబంధించినదేనని, సంస్థ ప్రమోటర్లు/ డైరెక్టర్ల నివాసాలపై సోదాలు జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ పన్నులు, అనుబంధ కంపెనీలకు నిధుల బదలాయింపుపై విచారణ కోసమే సర్వే చేస్తున్నామని తెలిపాయి. గతంలోనే నోటీసులు పంపినా బీబీసీ తిరస్కారపూరితంగా వ్యవహరించిందనీ, పెద్దమొత్తంలో లాభాలను మళ్లించిందని ఆరోపించాయి. కొన్ని మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఓ కంప్యూటర్ జప్తు చేసినట్లు వెల్లడించాయి.
వినాశకాలే విపరీత బుద్ధి: కాంగ్రెస్
ఐటీ సోదాలు ప్రతీకార దాడిలా కనిపిస్తున్నాయని ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. వ్యతిరేక వార్తల్ని ప్రసారం చేసేవారిని బెదిరించి, గొంతు నొక్కేందుకు జరుగుతున్న ప్రయత్నంగా భారాస, వామపక్షాలు పేర్కొన్నాయి. తాము అదానీ సమస్యపై జేపీసీ ద్వారా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తుంటే.. అధికార పార్టీ మాత్రం బీబీసీ వెంట పడుతోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. విపక్షంపైనా, మీడియా మీద దాడులకు సంస్థల్ని వాడుకుంటుంటే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెతను ప్రభుత్వ తీరు గుర్తు చేస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మండిపడ్డారు. ప్రేమికుల దినోత్సవాన ఐటీ సర్వే మొదలైందని, ప్రభుత్వానికి ప్రీతిపాత్రుడైన మిస్టర్.ఎ విషయంలో ఐటీ, సెబీ, ఈడీ వంటి సంస్థలు ఏం చేస్తున్నాయని అదానీని దృష్టిలో పెట్టుకుని తృణమూల్ ప్రశ్నించింది. మోదీది నిరంకుశమని ఆప్ ఆరోపించింది. సీపీఐ, సీసీఎం కూడా ఐటీ సోదాల్ని ఖండించాయి. ఇంతవరకు దేశంలోని మీడియా సంస్థలపైనే ఐటీ, ఇతర సంస్థల సోదాలు సాగేవనీ, ఇప్పుడు దేశంలో పనిచేస్తున్న విదేశీ సంస్థలకూ అది విస్తరించిందని సీపీఎం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ మతఛాందస విధానాన్ని ఎండగట్టినవారిపై విషంగక్కి దాడులు చేస్తున్నారని సీపీఐ ఆరోపించింది.
కాంగ్రెస్ ఎజెండాకు సరిపోయేలా బీబీసీ: భాజపా
కాంగ్రెస్ ఆరోపణలను భాజపా ఖండించింది. తప్పు చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది. ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయమైన సంస్థగా బీబీసీని అభివర్ణించింది. ‘దేశంపై విషం కక్కుతూ కాంగ్రెస్ ఎజెండాకు అనుగుణంగా ఇది పనిచేస్తోంది. ఐటీ శాఖ దాని పనిని అది చేసుకునేలా వదిలేయాలి. ఫలానా పనిని ఎప్పుడు చేయాలనేది ప్రభుత్వం గానీ, వెలుపలి శక్తిగానీ నిర్ణయించబోవు. బీబీసీ దుష్ప్రచారం కాంగ్రెస్ ఎజెండాకు చక్కగా సరిపోతుంది’ అని భాజపా అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎద్దేవా చేశారు. దేశంలో పనిచేసే ఏ సంస్థలైనా స్థానిక చట్టాలకు లోబడి ఉండాలన్నారు.
పాత్రికేయ సంఘాల అభ్యంతరం
ఐటీ సోదాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా ఇది పరిష్కారమవుతుందని బీబీసీ ఆశాభావం వ్యక్తంచేసింది. బీబీసీపై ఐటీ చేపట్టిన సర్వేను ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ఖండించింది. అధికార పార్టీని విమర్శించే సంస్థల్ని ప్రభుత్వం వేధిస్తోందని చెప్పడానికి ఇదో తార్కాణమని తెలిపింది. ఇలాంటి సోదాలు చేసేటప్పుడు పాత్రికేయుల/ మీడియా సంస్థల హక్కుల్ని దృష్టిలో పెట్టుకొని, ఎంతో జాగ్రత్తగా, సున్నితంగా వ్యవహరించాలని పేర్కొంది. మీడియాను బెదిరించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని ప్రభుత్వానికి ‘ప్రెస్క్లబ్ ఆఫ్ ఇండియా’ సూచించింది. కేంద్రం చర్యలను ‘కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్’ (సీపీజే), ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి విదేశీ సంస్థలూ తప్పుబట్టాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి