Valentine Day: భర్తకు బంగారు పూల బహుమతి

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ మహిళ తన భర్తకు ప్రత్యేక బహుమతి అందించారు. 108 బంగారు గులాబీలతో హృదయాకారంలో రూపొందించిన ప్రత్యేక పుష్పగుచ్ఛాన్ని అందజేసి ఆశ్చర్యపరిచారు.

Updated : 15 Feb 2023 09:54 IST

ప్రేమికుల రోజున ఇచ్చిన గుజరాత్‌ మహిళ

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ మహిళ తన భర్తకు ప్రత్యేక బహుమతి అందించారు. 108 బంగారు గులాబీలతో హృదయాకారంలో రూపొందించిన ప్రత్యేక పుష్పగుచ్ఛాన్ని అందజేసి ఆశ్చర్యపరిచారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన పరిధిబెన్‌ అనే మహిళ.. తన భర్త దీప్‌కు ఈ బహుమతి ఇచ్చారు. ‘‘నిజమైన గులాబీలైతే వాడిపోతాయి. బంగారు పూత పూసిన ఈ గులాబీలు అస్సలు వాడిపోవు. ఎల్లకాలం మా ప్రేమకు గుర్తుగా ఉంటాయి’’ అని దీపు చెప్పారు. ప్రేమికులరోజున నా భర్తకు ఏదైనా కొత్తగా ఇవ్వాలని భావించానని, అందుకే బంగారు పూత పూసిన గులాబీ పూలు ఇచ్చానని పరిధిబెన్‌ తెలిపారు. ఇందుకోసం ఆమె దాదాపు రూ.1.80 లక్షలు వెచ్చించారు. మరోవైపు, బంగారు పూత పూసిన 151 గులాబీలను ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వనున్నట్లు సూరత్‌కు చెందిన విద్యార్థులు గతంలో ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని