Robo shankar: హోం టూర్ తెచ్చిన తంటా.. నటుడికి రూ.2.5 లక్షల జరిమానా

అనుమతి లేకుండా ఇంట్లో చిలుకలు పెంచిన నటుడు రోబో శంకర్‌కు అటవీశాఖ రూ.2.5 లక్షల జరిమానా విధించింది.

Updated : 21 Feb 2023 09:22 IST

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే: అనుమతి లేకుండా ఇంట్లో చిలుకలు పెంచిన నటుడు రోబో శంకర్‌(robo shankar)కు అటవీశాఖ రూ.2.5 లక్షల జరిమానా విధించింది. చెన్నై సాలిగ్రామంలో ఉంటున్న నటుడు రోబో శంకర్‌ ఇటీవల హోంటూర్‌ పేరుతో తన నివాసంలో ఓ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టారు. అందులో.. అలెగ్జాండ్రిన్‌ పారాకీట్‌ అనే చిలుకలు పంజరంలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గురువారం రెండు చిలుకలను స్వాధీనం చేసుకుని గిండిలోని పార్కులో అప్పగించారు. అప్పుడు రోబో శంకర్‌, ఆయన భార్య శ్రీలంకలో ఉండటంతో దర్యాప్తునకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అటవీశాఖ అధికారుల ఎదుట హాజరై రోబో శంకర్‌ వివరణ ఇచ్చారు. తన భార్య స్నేహితురాలు మూడేళ్ల క్రితం ఈ చిలుకలను ఇచ్చినట్లు తెలిపారు. వీటిని పెంచేందుకు అటవీశాఖ అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియదని, ఇందుకు క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో అధికారులు వారిపై కేసు నమోదు చేయకుండా రూ.2.5 లక్షల జరిమానా విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని