సీబీఐ కస్టడీకి మనీశ్ సిసోదియా
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోదియాను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది.
అయిదు రోజులకు అనుమతించిన ప్రత్యేక కోర్టు
దేశవ్యాప్తంగా ఆప్ ఆందోళనలు
దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోదియాను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సీబీఐ చేసిన విజ్ఞప్తికి కోర్టు అంగీకారం తెలిపింది. మద్యం విధాన రూపకల్పన ప్రభుత్వ నిర్ణయమని, వ్యక్తిగతంగా కుట్ర చేసేందుకు అవకాశమే లేదని సిసోదియా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేనందున సీబీఐ దాఖలు చేసిన రిమాండు అభ్యర్థనను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి తొలుత విచారణను వాయిదా వేశారు. అనంతరం మార్చి 4 వరకు సిసోదియాను కస్టడీలోకి తీసుకోవడానికి సీబీఐకి అనుమతినిస్తూ సాయంత్రానికి నిర్ణయాన్ని వెలువరించారు. అంతకుముందు సిసోదియాను భారీ భద్రత నడుమ అధికారులు కోర్టుకు తీసుకొచ్చారు. విచారణ జరిగిన రౌస్ ఎవెన్యూ కోర్టు కాంప్లెక్స్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం కోర్టులో సుమారు గంటన్నరకు పైగా వాడీవేడి వాదనలు జరిగాయి. మద్యం విధానం సవరణకు ఆమోదముద్ర వేసింది లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అని, కానీ సీబీఐ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వెనక పడుతోందని సిసోదియా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీని అనేక సంప్రదింపుల అనంతరం రూపొందించారని, ఎల్జీ నుంచి సైతం సలహాలు తీసుకునే నూతన విధానాన్ని తయారుచేశారని తెలిపారు. ఇందులో అవకతవకలకు అవకాశమే లేదని వాదించారు. బడ్జెట్ సమర్పించాల్సిన ఈ సమయంలో ఒక ఆర్థికమంత్రిని అరెస్టు చేయడం ఒక వ్యక్తిపై కాక వ్యవస్థపైన జరిగిన దాడిగా పేర్కొన్నారు. ముద్దాయి పలుమార్లు సెల్ఫోన్లు మార్చారని సీబీఐ ఆరోపిస్తోందని అదేం నేరం కాదు కదా అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో తాము దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సిసోదియాను ఏ1 నిందితుడిగా పేర్కొన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. మద్యం విధానం కోసం రూపొందించిన డ్రాఫ్ట్ నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోదియా తొలగించారని ఆరోపించింది. ఆయన తమ ప్రశ్నలకు ఎగవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారని పేర్కొంది.
సీబీఐకి అరెస్టు ఇష్టంలేదు: కేజ్రీవాల్
సీబీఐ అధికారుల్లో చాలా మందికి సిసోదియాను అరెస్టు చేయడం ఇష్టం లేదని,. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారు ఆ పని చేయక తప్పలేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ట్వీట్ చేశారు. కల్పితాలను వాస్తవాలుగా ప్రచారం చేయడాన్ని కేజ్రీవాల్ మానుకోవాలని భాజపా ఎంపీ మనోజ్ తివారీ ఆ ట్వీట్కు బదులిచ్చారు. అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు డిమాండు చేసిన నాయకులను కావాలని ఈ నియంతృత్వ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా వినియోగిస్తోందని ఆరోపిస్తూ సీపీఎం ఓ ప్రకటన విడుదల చేసింది. దిల్లీ ప్రజలు భాజపాకు త్వరలోనే గుణపాఠం చెబుతారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టుపై ఆప్ గరం గరం
సిసోదియా అరెస్టుకు నిరసనగా ఆప్ కార్యాలయం నుంచి భాజపా ప్రధాన కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లేందుకు ఆప్ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఆప్ కార్యాలయం బయటే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళనలు హెచ్చుమీరడంతో పారామిలటరీ దళాలను పెద్ద సంఖ్యలో మోహరించి, డ్రోన్ల సాయంతో పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఎంత హెచ్చరించినా ఆందోళన విరమించకపోవడంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని సుమారు 10 బస్సుల్లో పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు. దిల్లీతో పాటు చండీగఢ్, భోపాల్, కోల్కతా, ముంబయి, శ్రీనగర్, జమ్మూ, పణజీ, పట్నా తదితర నగరాల్లో ఆప్ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. ఆప్ ఆందోళనలపై భాజపా దుమ్మెత్తిపోసింది. అవినీతికి వ్యతిరేకంగా సీబీఐ చట్టబద్ధంగా ముందుకు వెళ్తోందని, ఆప్ మాత్రం చట్టం, రాజ్యాంగం, ప్రజలను తన స్పృహలోంచి తీసేసినట్లు కనిపిస్తోందని భాజపా ఆరోపించింది. ఇద్దరు మంత్రులు ఇప్పటికే అవినీతి కేసుల్లో అరెస్టయినందున సీఎం కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేసింది.
సౌత్గ్రూప్తో కుమ్మక్కయ్యారు: రిమాండు రిపోర్టులో సీబీఐ
ఈనాడు, దిల్లీ: దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా దక్షిణ భారత వ్యాపారుల (సౌత్గ్రూప్)తో కుమ్మక్కై ఎక్సైజ్ పాలసీని మార్చినట్లు సీబీఐ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ విధాన రూపకల్పన జరిగే సమయంలో ఆయన నాలుగు ఫోన్లు మార్చారని, అందులో మూడింటిని ధ్వంసం చేశారని తెలిపింది ‘‘ఈ పాలసీ కోసం రూపొందించిన ముసాయిదాలో తొలుత హోల్సేలర్స్ ప్రాఫిట్ మార్జిన్ 5 శాతం, రూ.100 కోట్ల టర్నోవర్ ఉండాలని ప్రతిపాదించారు. అయితే తర్వాత మూడు రోజుల్లోనే హోల్సేలర్స్ ప్రాఫిట్ మార్జిన్ను 5 నుంచి 12 శాతానికి, టర్నోవర్ పరిమితిని రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచుతూ మార్పులు చేశారు. ఇందుకు కారణాలేంటన్నది సిసోదియా చెప్పలేకపోయారు’ అని రిపోర్టులో పేర్కొంది.
ముసాయిదాలో వాట్సప్ సంభాషణలు
హోల్సేలర్స్కు 12% ప్రాఫిట్ మార్జిన్ నిర్ణయించడానికి ఏ ప్రాతిపదికను అనుసరించారో చెప్పే డాక్యుమెంట్లు ఎక్సైజ్ శాఖలో కనిపించలేదని పైగా సిసోదియా, కొందరు సహ నిందితుల మధ్య జరిగిన వాట్సప్ సంభాషణలనే ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఖరారుచేసిన ముసాయిదాలో యథాతథంగా చేర్చారని సీబీఐ పేర్కొంది. ‘పాలసీని తమకు అనుగుణంగా రాసుకుని అనుచిత లబ్ధి పొందడానికి నిందితులంతా కుమ్మక్కయ్యారని ఈ ఉదంతం స్పష్టంగా చెబుతోంది. ఈకేసును సీబీఐకి ప్రతిపాదించిన 2022 జులై 22వ తేదీ నాడే సిసోదియా తన ఫోన్ మార్చారు. దాన్ని దర్యాప్తు సమయంలో సీబీఐకి అప్పగించలేదు. 2021 జనవరి 1 నుంచి ఆగస్టు 19 మధ్యకాలంలో నాలుగు మొబైళ్లు మార్చారు. అందులో మూడింటిని ధ్వంసం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఎ కింద మూడుసార్లు నోటీసులు ఇవ్వగా ఆయన గత ఏడాది అక్టోబర్ 17న, ఈ ఏడాది ఫిబ్రవరి 26న హాజరయ్యారు. తగినంత సమయం ఇచ్చినా విచారణలో సిసోదియా నిజాలను దాచిపెట్టారు. ఈ కేసులో ఇతర నిందితుల పాత్ర, అక్రమంగా హవాలా మార్గంలో సంపాదించిన డబ్బు గురించి చెప్పడంలేదు. తనకు వ్యక్తిగతంగా తెలిసిన విషయాలను చెప్పకుండా దాటవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్ట్ చేశాం’’ అని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సీబీఐ వెల్లడించింది.
ప్రధాని, అదానీల బంధంపై ప్రజల దృష్టి మళ్లించేందుకే
దిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్టుపై సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: ప్రధాని, అదానీల మధ్య అనుబంధంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసిందని భారాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!