వింత ఘటన.. ఈయన భార్యను తీసుకెళ్లిపోతే.. ఆయన సతీమణిని పెళ్లాడాడు..

బిహార్‌లోని ఖగాఢియా జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యతో మరో వ్యక్తి పరారవ్వగా, నిందితుడి భార్యను బాధితుడు వివాహం చేసుకున్నాడు.

Updated : 28 Feb 2023 07:57 IST

బిహార్‌లోని ఖగాఢియా జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యతో మరో వ్యక్తి పరారవ్వగా, నిందితుడి భార్యను బాధితుడు వివాహం చేసుకున్నాడు. ఛౌథామ్‌ బ్లాక్‌లోని హార్డియా గ్రామానికి చెందిన ముఖేశ్‌.. నీరజ్‌ అనే వ్యక్తి భార్యతో పరారయ్యాడు. దీంతో ముఖేశ్‌ భార్యను నీరజ్‌ వివాహం చేసుకున్నాడు. నీరజ్‌కు ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారు. మరోవైపు, ఈ ఘటనతో సంబంధమున్న ఇద్దరు మహిళల పేర్లూ రూబీయే కావడం గమనార్హం.

ముఖేశ్‌తో వెళ్లిపోయిన రూబీకి వివాహానికి ముందు నుంచే అతనితో పరిచయం ఉంది. పెళ్లికి ముందు అతడిని ప్రేమించింది. పెళ్లి తర్వాత పరిచయాన్ని కొనసాగించింది. ముఖేశ్‌కూ గతంలో వివాహం అయింది. అయితే గతేడాది ఫిబ్రవరిలో అతను ప్రియురాలు రూబీని ఇంటి నుంచి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం వారిద్దరూ.. తమ ముగ్గురు సంతానాన్ని తీసుకుని గ్రామం విడిచి వెళ్లిపోయారు. ముఖేశ్‌తో తన భార్య వెళ్లిపోయిన సంగతి నీరజ్‌కు తెలియడంతో అతను పస్రాహా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అనంతరం గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టగా ప్రియురాలిని విడిచి ఉండేందుకు ముఖేశ్‌ అంగీకరించలేదు. దీంతో ముఖేశ్‌పై పగ తీర్చుకునేందుకు నీరజ్‌ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో ముఖేశ్‌ మొదటి భార్య (ప్రియురాలు కాదు) రూబీతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఈ నెల 18న స్థానిక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. నీరజ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, ముఖేశ్‌ రోజు కూలీగా పనిచేస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని