కాళ్లకి చిప్‌, కెమెరా.. పట్టుబడిన గూఢచర్య పావురం..

కెమెరా, మైక్రోచిప్‌లు అమర్చి ఉన్న ఓ పావురాన్ని ఒడిశా జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాలోని పారాదీప్‌ సముద్రతీరంలో గుర్తించారు.

Updated : 09 Mar 2023 08:39 IST

పారాదీప్‌: కెమెరా, మైక్రోచిప్‌లు అమర్చి ఉన్న ఓ పావురాన్ని ఒడిశా జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాలోని పారాదీప్‌ సముద్రతీరంలో గుర్తించారు. కొద్దిరోజులు క్రితం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తమ పడవలో ఉన్న ఈ పావురాన్ని బంధించి బుధవారం మెరైన్‌ పోలీసులకు అప్పగించారు. దానిని పరిశీలించిన పోలీసులు ఈ పక్షిని గూఢచర్యం కోసం ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పావురం రెక్కలపై అర్థం కాని భాషలో ఏదో రాసి ఉందని, దాని కాళ్లకు చిప్‌, కెమెరా ఉన్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని