నా తండ్రి రాత్రి ఇంటికొస్తే భయమేసేది: దిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్

కన్నతండ్రి లైంగిక వేధింపులకు గురిచేశాడని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ ఇటీవల ప్రకటిస్తే.. తాజాగా దిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ కూడా తానూ ఆ తరహా వేధింపులకు గురైన బాధితురాలినేనని పేర్కొన్నారు.

Updated : 12 Mar 2023 08:27 IST

దిల్లీ: కన్నతండ్రి లైంగిక వేధింపులకు గురిచేశాడని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ ఇటీవల ప్రకటిస్తే.. తాజాగా దిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ కూడా తానూ ఆ తరహా వేధింపులకు గురైన బాధితురాలినేనని పేర్కొన్నారు. తండ్రి లైంగిక వేధింపులు భరించలేక, మంచం కింద దాక్కొన్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు. నాలుగో తరగతి వరకు తనపై వేధింపులు కొనసాగాయని తెలిపారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘నా 4వ తరగతి వరకు మేం ఆయనతో కలిసి ఉన్నాం. నన్ను ఆయన అకారణంగా కొట్టేవారు. కొన్నిసార్లు రక్తం వచ్చేది. ఆయన ఇంట్లోకి వస్తే.. భయమేసేది. ఎన్నోసార్లు మంచం కింద దాక్కున్నా’’ అని స్వాతి మాలివాల్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు