Punjab: ఐపీఎస్‌ అధికారిణిని మనువాడనున్న పంజాబ్‌ మంత్రి

పంజాబ్‌ రాష్ట్ర మంత్రి హర్‌జోత్‌ బెయిన్స్‌, ఆ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి జ్యోతి యాదవ్‌ త్వరలో ఏడడుగులు వేయనున్నారు.

Published : 14 Mar 2023 08:49 IST

పంజాబ్‌ రాష్ట్ర మంత్రి హర్‌జోత్‌ బెయిన్స్‌, ఆ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి జ్యోతి యాదవ్‌ త్వరలో ఏడడుగులు వేయనున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగినట్లు సమాచారం. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 బ్యాచ్‌కు చెందిన జ్యోతి యాదవ్‌ ప్రస్తుతం మాన్సా జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

హర్‌జోత్‌ బెయిన్స్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత. గత పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆనంద్‌పుర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. వీరి పెళ్లి ఈ నెలలోనే జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వివాహానికి దిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ హాజరు కానున్నట్లు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని