రూ.25 వేలు కట్టను.. జైలుకే వెళ్తా
ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి సిగరెట్ తాగడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
విమానంలో సిగరెట్ తాగిన ప్రయాణికుడి వింత వాదన
ముంబయి: ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి సిగరెట్ తాగడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తన అనుచిత ప్రవర్తనతో తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన అతడిని.. కాళ్లు, చేతులు కట్టేసి సీటులో కూర్చొబెట్టారు సిబ్బంది. అనంతరం విమానయాన సిబ్బంది ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసినా.. తన ‘ఇంటర్నెట్’ వాదనతో దాన్ని నిరాకరించి, జైలుకే వెళ్తానని చెప్పడం గమనార్హం. భారత సంతతికి చెందిన రత్నాకర్ ద్వివేది(37) ఇటీవల లండన్ నుంచి ముంబయికి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. విమానంలోని బాత్రూంకి వెళ్లి పొగ తాగుతుండగా.. అప్రమత్తమైన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దీంతో అరవడం మొదలుపెట్టిన అతడు.. విమానం తలుపును తెరిచేందుకు యత్నించాడు. చివరకు అతడి కాళ్లు, చేతులు కట్టేసి కుర్చీలోనే కూర్చునేలా చేశామని విమాన సిబ్బంది వెల్లడించారు. అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. రూ.25 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మొత్తాన్ని చెల్లించేందుకు అతడు నిరాకరించాడు. ఇంటర్నెట్లో వెతికితే సంబంధిత సెక్షన్ కింద రూ.250 మాత్రమే జరిమానా ఉందని.. అంతే చెల్లిస్తానని వాదించాడు. కావాలంటే.. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. దీంతో కోర్టు అతడిని జైలుకు తరలించాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని