జడ్జీల నియామక ప్రతిపాదనలపై.. అసాధారణ పరిస్థితుల్లోనే ‘రా’ నివేదిక
సాధారణంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామక ప్రతిపాదనలపై ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) నివేదికలు కోరడం పద్ధతి కాదని, జాతీయ భద్రతతో కూడిన అసాధారణ పరిస్థితుల్లో మాత్రం ఇది తప్పనిసరి.
లోక్సభలో న్యాయశాఖ మంత్రి : కిరణ్ రిజిజు
దిల్లీ: సాధారణంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామక ప్రతిపాదనలపై ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) నివేదికలు కోరడం పద్ధతి కాదని, జాతీయ భద్రతతో కూడిన అసాధారణ పరిస్థితుల్లో మాత్రం ఇది తప్పనిసరి అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం లోక్సభలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. ప్రామాణిక విధానాల ప్రకారం హైకోర్టు కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలిపేముందు అవసరమైన, అందుబాటులో ఉన్న నివేదికలను ప్రభుత్వం పరిశీలించి ఓ నిర్ణయం తీసుకొంటుందన్నారు. దిల్లీ హైకోర్టు జడ్జిగా ఓ న్యాయవాదికి పదోన్నతి కల్పించే విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం ‘రా’ నివేదికను బహిర్గతం చేయడంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఆ నివేదికలో అభ్యర్థి లైంగిక ఆసక్తుల (సెక్సువాలిటీ) గురించి ఉన్నట్లు పేర్కొన్నారు. ఓ విదేశీయుడు ఆ అభ్యర్థి జీవిత భాగస్వామిగా ఉన్నందున పునఃపరిశీలన నిమిత్తం ఆ పేరును కొలీజియంకు వెనక్కు పంపినట్లు వివరించారు. మద్రాసు హైకోర్టు జడ్జి నియామకానికి సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ ఫిబ్రవరి 10వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. న్యాయమూర్తులుగా తగిన వ్యక్తుల నియామకానికి వారి రాజకీయ నేపథ్యం అడ్డు కాబోదని పేర్కొన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇదేవిధంగా పదోన్నతి కోసం సిఫార్సు చేసిన వ్యక్తుల విధానాలు, చర్యలను విమర్శించడమంటే వారిని అనర్హులుగా పేర్కొనడం కాదన్నారు.
ఏకకాల ఎన్నికలపై సిఫార్సుల పరిశీలన
దేశంలో లోక్సభకు, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాలంటూ పలుమార్లు తన ఆకాంక్షను వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం లోక్సభలో మరోమారు ఈ వాదన వినిపించింది. అలా జరిగితే ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అవుతుందని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేసేలా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఏకకాల ఎన్నికల ఆవశ్యకతలతో జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఏకకాల ఎన్నికల అంశాన్ని పలు కోణాల్లో పార్లమెంటరీ ప్యానెల్ అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఈసీ కూడా భాగస్వామిగా ఉన్న ఈ కమిటీ ఏకకాల ఎన్నికలపై కొన్ని సిఫార్సులను చేసిందన్నారు. లా కమిషన్ పరిశీలన ముగిశాక.. ఈ ప్రక్రియపై ఆచారణ సాధ్యమైన కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి రాజ్యాంగంలో కనీసం అయిదు ఆర్టికల్స్ సవరించాల్సి ఉంటుందన్నారు.
ఎరువులపై రాయితీ తగ్గించే యోచన లేదు
దేశంలో ఎరువులపై ఇస్తున్న రాయితీలను తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు స్పష్టం చేసింది. రసాయన, ఎరువుల శాఖ సహాయమంత్రి భగవంత్ ఖుబా లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. రైతులకు ఇస్తున్న ఎరువుల రాయితీలు తగ్గిస్తే పడే ప్రభావం గురించి ఇప్పటిదాకా ఎటువంటి అధ్యయనం చేపట్టలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.