మరోసారి కొలీజియం రగడ
దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు దిశానిర్దేశం చేసేది రాజ్యాంగమేనని, ఆ మూడు విభాగాల బాధ్యతలకు సంబంధించి ‘లక్ష్మణ రేఖ’ స్పష్టంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
జడ్జీల నియామకం బాధ్యత ప్రభుత్వానిదే
పరిపాలనాంశాల్లో జడ్జీలు నిమగ్నమైతే తీర్పులెవరిస్తారు?: కిరణ్ రిజిజు
కొలీజియం వ్యవస్థే ఉత్తమం.. న్యాయ వ్యవస్థ స్వతంత్రతే ముఖ్యం: సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్
దిల్లీ: దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు దిశానిర్దేశం చేసేది రాజ్యాంగమేనని, ఆ మూడు విభాగాల బాధ్యతలకు సంబంధించి ‘లక్ష్మణ రేఖ’ స్పష్టంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పరిపాలనాపరమైన నియామకాల్లో జడ్జీలు తలమునకలైతే న్యాయ విధులుు ఎవరు నిర్వర్తిస్తారని ప్రశ్నించారు. శనివారం ఇండియాటుడే కాంక్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల ఎంపికకు ప్రధాని, విపక్షనేత, భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘ఎన్నికల సంఘంలోని కమిషనర్ల నియామకాలను రాజ్యాంగం నిర్దేశించింది. దీనికి చట్టం లేనిమాట నిజమే. ఇందుకు పార్లమెంటు చట్టాన్ని రూపొందించాల్సి ఉంది. అయితే, ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఇలా ప్రతి ముఖ్యమైన నియామకంపై తమ సమయాన్ని వెచ్చించాల్సి వస్తే...తీర్పులు ఎవరిస్తారు? దేశంలో పరిపాలనాపరమైన విషయాలు చాలా ఉంటాయి. ప్రజల వివాదాలు పరిష్కరించి న్యాయం చేయడం జడ్జీల ప్రధాన విధి’ అని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టడం లేదంటూనే రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు.
కోర్టులు విపక్ష పాత్ర వహించాలా?
దేశ వ్యతిరేక ముఠాలో భాగస్వాములైన కొందరు సామాజిక ఉద్యమకారులు, కొద్ది మంది మాజీ న్యాయమూర్తులు కోర్టులు విపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటూ అందుకు ప్రయత్నిస్తున్నారని కిరణ్ రిజిజు విమర్శించారు. అయితే భారతదేశంలో న్యాయవ్యవస్థ తటస్థంగానే ఉంటుందన్నారు. కొలీజియం వ్యవస్థనూ కేంద్ర మంత్రి తప్పుపట్టారు. ‘గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దుస్సాహసాల వల్లే కొలీజియం వ్యవస్థను సుప్రీంకోర్టు ఉనికిలోకి తెచ్చింది. అయితే, కొందరు దీనిని న్యాయవ్యవస్థ మితిమీరిన చర్యగా అభివర్ణించార’ని మంత్రి గుర్తు చేశారు. కొత్త విధానం అందుబాటులోకి వచ్చే వరకూ కొలీజియం వ్యవస్థ కొనసాగుతుందని, రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణేమీ లేదన్నారు.
భిన్నాభిప్రాయాలుంటే తప్పేంటి?: సీజేఐ
ప్రతి వ్యవస్థలోనూ లోపాలుంటాయని, ఏదీ పరిపూర్ణమైనది కాదని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేర్కొన్నారు. అయితే, న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసుకున్న కొలీజియం ఉత్తమమైనదని ఆయన సమర్థించారు. కొలీజియం వ్యవస్థపై, కొన్ని సిఫార్సులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు అసంతృప్తి వ్యక్తంచేయడంపైనా సీజేఐ ప్రతిస్పందించారు. ‘ఆ విషయంలో న్యాయ మంత్రితో వాదనలు చేయాలనుకోవట్లేదు. ఆయనకో అభిప్రాయం ఉంది, నాకో అభిప్రాయం ఉంది. భిన్నాభిప్రాయాలుంటే తప్పేంటి? న్యాయ వ్యవస్థలోనే కాదు ప్రభుత్వంలోనూ అభిప్రాయ భేదాలు ఎదురవుతుంటాయి’ అని వ్యాఖ్యానించారు. ‘కొలీజియం ప్రధాన లక్ష్యం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవడం, బాహ్య ప్రభావాల నుంచి దానికి రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవడమే’నని అభిప్రాయపడ్డారు. వ్యవస్థను ఉన్నది ఉన్నట్లుగా ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన న్యాయమూర్తిగా తన బాధ్యతని పేర్కొన్నారు. జడ్జీల నియామకాలకు సరైన నియమ నిబంధనలను పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో జడ్జీలపై వస్తున్న ట్రోలింగ్స్పై మాట్లాడుతూ...అలాంటి వ్యంగ్యాస్త్రాలు తమను ప్రభావితం చేయలేవన్నారు. మాజీ సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ కొలీజియం వ్యవస్థ ఆదర్శప్రాయమైనదని పేర్కొనగా మరో మాజీ సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే దానిని సమర్థిస్తూనే ప్రభుత్వ అభిప్రాయం కూడా కీలకమేనన్నారు.
తీర్పుల్లో ఇతరుల జోక్యం గురించి మాట్లాడుతూ ‘‘కేసుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు. న్యాయమూర్తిగా నా 23 ఏళ్ల కెరీర్లో ఏ కేసు విషయంలోనూ ఇలాంటి తీర్పు ఇవ్వాలని ఎవరూ చెప్పలేదు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు.
సెలవుల్లోనూ న్యాయమూర్తులకు పని
కోర్టుకు అధిక సంఖ్యలో సెలవులు ఉంటున్నాయని, దీనివల్ల సామాన్యులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతోందన్న వ్యాఖ్యలను సీజేఐ తోసిపుచ్చారు. న్యాయమూర్తులకు వాస్తవంగా ఎలాంటి సెలవులూ ఉండవని, వారమంతా రాత్రింబవళ్లు పనిచేయాల్సి వస్తుందన్నారు. రేపు కోర్టు ముందుకు రాబోయే కేసుల్లో ఏముందో తెలుసుకోవడానికి ప్రతిరోజూ సాయంత్రం కోర్టు వేళలు ముగిసిన తర్వాత చదవాల్సి ఉంటుందని తెలిపారు. రోజువారీగా రిజర్వు చేసే తీర్పులను శనివారం రాయాల్సి ఉంటుంది. సోమవారం కోర్టు ముందుకొచ్చే కేసులను ఆదివారం చదవాల్సి వస్తుందని వివరించారు. ప్రపంచంలో ఏ దేశ సుప్రీంకోర్టూ మనంత సుదీర్ఘంగా పనిచేయడంలేదంటూ అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, బ్రిటన్ దేశాల సుప్రీంకోర్టుల సెలవుల వివరాలను తెలిపారు.
సుప్రీంకోర్టు, హైకోర్టులలో జడ్జీల నియామక విధానంపై ప్రభుత్వ వర్గాలు, న్యాయ వ్యవస్థల మధ్య మరోసారి గట్టి సంవాదం జరిగింది. ‘ఇండియాటుడే కాంక్లేవ్-2023’ ఈ సారి అందుకు వేదికయింది. కొన్ని లోపాలున్నా కొలీజియం వ్యవస్థ ఉత్తమమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సమర్థించగా.. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాత్రం జడ్జీల నియామకాల బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థదేనని ఉద్ఘాటించారు. రాజ్యాంగం ఆ విధిని ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దుస్సాహసాల వల్లే కొలీజియం వ్యవస్థ మనుగడలోకి వచ్చిందని దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ