మరోసారి కొలీజియం రగడ
దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు దిశానిర్దేశం చేసేది రాజ్యాంగమేనని, ఆ మూడు విభాగాల బాధ్యతలకు సంబంధించి ‘లక్ష్మణ రేఖ’ స్పష్టంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
జడ్జీల నియామకం బాధ్యత ప్రభుత్వానిదే
పరిపాలనాంశాల్లో జడ్జీలు నిమగ్నమైతే తీర్పులెవరిస్తారు?: కిరణ్ రిజిజు
కొలీజియం వ్యవస్థే ఉత్తమం.. న్యాయ వ్యవస్థ స్వతంత్రతే ముఖ్యం: సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్
దిల్లీ: దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు దిశానిర్దేశం చేసేది రాజ్యాంగమేనని, ఆ మూడు విభాగాల బాధ్యతలకు సంబంధించి ‘లక్ష్మణ రేఖ’ స్పష్టంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పరిపాలనాపరమైన నియామకాల్లో జడ్జీలు తలమునకలైతే న్యాయ విధులుు ఎవరు నిర్వర్తిస్తారని ప్రశ్నించారు. శనివారం ఇండియాటుడే కాంక్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల ఎంపికకు ప్రధాని, విపక్షనేత, భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘ఎన్నికల సంఘంలోని కమిషనర్ల నియామకాలను రాజ్యాంగం నిర్దేశించింది. దీనికి చట్టం లేనిమాట నిజమే. ఇందుకు పార్లమెంటు చట్టాన్ని రూపొందించాల్సి ఉంది. అయితే, ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఇలా ప్రతి ముఖ్యమైన నియామకంపై తమ సమయాన్ని వెచ్చించాల్సి వస్తే...తీర్పులు ఎవరిస్తారు? దేశంలో పరిపాలనాపరమైన విషయాలు చాలా ఉంటాయి. ప్రజల వివాదాలు పరిష్కరించి న్యాయం చేయడం జడ్జీల ప్రధాన విధి’ అని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టడం లేదంటూనే రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు.
కోర్టులు విపక్ష పాత్ర వహించాలా?
దేశ వ్యతిరేక ముఠాలో భాగస్వాములైన కొందరు సామాజిక ఉద్యమకారులు, కొద్ది మంది మాజీ న్యాయమూర్తులు కోర్టులు విపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటూ అందుకు ప్రయత్నిస్తున్నారని కిరణ్ రిజిజు విమర్శించారు. అయితే భారతదేశంలో న్యాయవ్యవస్థ తటస్థంగానే ఉంటుందన్నారు. కొలీజియం వ్యవస్థనూ కేంద్ర మంత్రి తప్పుపట్టారు. ‘గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దుస్సాహసాల వల్లే కొలీజియం వ్యవస్థను సుప్రీంకోర్టు ఉనికిలోకి తెచ్చింది. అయితే, కొందరు దీనిని న్యాయవ్యవస్థ మితిమీరిన చర్యగా అభివర్ణించార’ని మంత్రి గుర్తు చేశారు. కొత్త విధానం అందుబాటులోకి వచ్చే వరకూ కొలీజియం వ్యవస్థ కొనసాగుతుందని, రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణేమీ లేదన్నారు.
భిన్నాభిప్రాయాలుంటే తప్పేంటి?: సీజేఐ
ప్రతి వ్యవస్థలోనూ లోపాలుంటాయని, ఏదీ పరిపూర్ణమైనది కాదని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేర్కొన్నారు. అయితే, న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసుకున్న కొలీజియం ఉత్తమమైనదని ఆయన సమర్థించారు. కొలీజియం వ్యవస్థపై, కొన్ని సిఫార్సులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు అసంతృప్తి వ్యక్తంచేయడంపైనా సీజేఐ ప్రతిస్పందించారు. ‘ఆ విషయంలో న్యాయ మంత్రితో వాదనలు చేయాలనుకోవట్లేదు. ఆయనకో అభిప్రాయం ఉంది, నాకో అభిప్రాయం ఉంది. భిన్నాభిప్రాయాలుంటే తప్పేంటి? న్యాయ వ్యవస్థలోనే కాదు ప్రభుత్వంలోనూ అభిప్రాయ భేదాలు ఎదురవుతుంటాయి’ అని వ్యాఖ్యానించారు. ‘కొలీజియం ప్రధాన లక్ష్యం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవడం, బాహ్య ప్రభావాల నుంచి దానికి రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవడమే’నని అభిప్రాయపడ్డారు. వ్యవస్థను ఉన్నది ఉన్నట్లుగా ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన న్యాయమూర్తిగా తన బాధ్యతని పేర్కొన్నారు. జడ్జీల నియామకాలకు సరైన నియమ నిబంధనలను పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో జడ్జీలపై వస్తున్న ట్రోలింగ్స్పై మాట్లాడుతూ...అలాంటి వ్యంగ్యాస్త్రాలు తమను ప్రభావితం చేయలేవన్నారు. మాజీ సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ కొలీజియం వ్యవస్థ ఆదర్శప్రాయమైనదని పేర్కొనగా మరో మాజీ సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే దానిని సమర్థిస్తూనే ప్రభుత్వ అభిప్రాయం కూడా కీలకమేనన్నారు.
తీర్పుల్లో ఇతరుల జోక్యం గురించి మాట్లాడుతూ ‘‘కేసుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు. న్యాయమూర్తిగా నా 23 ఏళ్ల కెరీర్లో ఏ కేసు విషయంలోనూ ఇలాంటి తీర్పు ఇవ్వాలని ఎవరూ చెప్పలేదు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు.
సెలవుల్లోనూ న్యాయమూర్తులకు పని
కోర్టుకు అధిక సంఖ్యలో సెలవులు ఉంటున్నాయని, దీనివల్ల సామాన్యులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతోందన్న వ్యాఖ్యలను సీజేఐ తోసిపుచ్చారు. న్యాయమూర్తులకు వాస్తవంగా ఎలాంటి సెలవులూ ఉండవని, వారమంతా రాత్రింబవళ్లు పనిచేయాల్సి వస్తుందన్నారు. రేపు కోర్టు ముందుకు రాబోయే కేసుల్లో ఏముందో తెలుసుకోవడానికి ప్రతిరోజూ సాయంత్రం కోర్టు వేళలు ముగిసిన తర్వాత చదవాల్సి ఉంటుందని తెలిపారు. రోజువారీగా రిజర్వు చేసే తీర్పులను శనివారం రాయాల్సి ఉంటుంది. సోమవారం కోర్టు ముందుకొచ్చే కేసులను ఆదివారం చదవాల్సి వస్తుందని వివరించారు. ప్రపంచంలో ఏ దేశ సుప్రీంకోర్టూ మనంత సుదీర్ఘంగా పనిచేయడంలేదంటూ అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, బ్రిటన్ దేశాల సుప్రీంకోర్టుల సెలవుల వివరాలను తెలిపారు.
సుప్రీంకోర్టు, హైకోర్టులలో జడ్జీల నియామక విధానంపై ప్రభుత్వ వర్గాలు, న్యాయ వ్యవస్థల మధ్య మరోసారి గట్టి సంవాదం జరిగింది. ‘ఇండియాటుడే కాంక్లేవ్-2023’ ఈ సారి అందుకు వేదికయింది. కొన్ని లోపాలున్నా కొలీజియం వ్యవస్థ ఉత్తమమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సమర్థించగా.. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాత్రం జడ్జీల నియామకాల బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థదేనని ఉద్ఘాటించారు. రాజ్యాంగం ఆ విధిని ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దుస్సాహసాల వల్లే కొలీజియం వ్యవస్థ మనుగడలోకి వచ్చిందని దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!