రాహుల్ ఇంటి వద్ద హైడ్రామా
‘మహిళలు ఇంకా లైంగిక వేధింపులకు గురవుతున్నారు’ అన్న వ్యాఖ్యలపై వివరాల సేకరణ పేరుతో ఆదివారం దిల్లీ పోలీసులు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇంటికి వచ్చారు.
మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారన్న వ్యాఖ్యలపై వివరాల సేకరణకు పోలీసుల రాక
బయట కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత
గంటపాటు భేటీ అయి వివరాలడిగిన పోలీసులు
ఆ తర్వాత ప్రాథమిక సమాధానం పంపిన కాంగ్రెస్ అగ్రనేత
10 రోజుల్లో వివరంగా జవాబిస్తానని వెల్లడి
ఇప్పుడొచ్చి హడావుడి చేయడమేంటని ధ్వజం
దిల్లీ: ‘మహిళలు ఇంకా లైంగిక వేధింపులకు గురవుతున్నారు’ అన్న వ్యాఖ్యలపై వివరాల సేకరణ పేరుతో ఆదివారం దిల్లీ పోలీసులు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇంటికి వచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, బాధితుల వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చారని తెలియడంతో రాహుల్ ఇంటివద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనరు సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలోని పోలీసు బృందం ఉదయం 10 గంటలకు రాహుల్ ఇంటికి వచ్చింది. అప్పటికే ఆయన ఇంటిచుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు గంటలు వేచి ఉన్నాక రాహుల్ను కలిసిన పోలీసు బృందం బాధితుల వివరాలను కోరింది. మధ్యాహ్నం 1 గంటకు పోలీసులు వెళ్లిపోయారు. పోలీసులు ఉన్నప్పుడే కాంగ్రెస్ నేతలు పవన్ ఖేడా, అభిషేక్ మను సింఘ్వి, జైరాం రమేశ్ తదితరులు రాహుల్ ఇంటికి వచ్చారు. ఆయన ఇంటి బయట ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత విడిచి పెట్టారు. శ్రీనగర్లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా బాధితులు ఆయనను కలిసి ఫిర్యాదు చేస్తే ఆ వివరాలను ఇవ్వాలని, వారికి భద్రత కల్పిస్తామని అంటున్నారు. ఇప్పటికే స్థానికంగా ఎవరైనా బాధితులు ఉన్నారా అని విచారించామని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అందుకే రాహుల్ గాంధీని అడిగి వివరాలు తెలుసుకోవాలనుకున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఆయనను కలిసేందుకు వచ్చామని.. వివరాలిస్తే చర్యలకు సిద్ధమని హుడా తెలిపారు.
ప్రాథమిక సమాధానం పంపిన రాహుల్
దిల్లీ పోలీసుల నోటీసుపై ఆదివారం నాలుగు పేజీల ప్రాథమిక సమాధానాన్ని రాహుల్ గాంధీ పంపారు. 5 రోజుల్లో 3 సార్లు తనను కలిసేందుకు పోలీసులు రావడంపై ఆయన స్పందించారు. 10 రోజుల్లో పూర్తి వివరాలతో సమాధానం ఇస్తానని పేర్కొన్నారు. పోలీసుల తీరు దారుణమని, అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలా చేస్తున్నారా అని ఈ సందర్భంగా నిలదీశారు. తాను వ్యాఖ్యలు చేసిన 45 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి హడావుడి చేయడమేమిటని ప్రశ్నించారు.
హిట్లర్కేమైందో అందరికీ తెలుసు: కాంగ్రెస్
ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. రాజకీయ సభల్లో చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేయడంద్వారా భాజపా తప్పుడు సంకేతాలను పంపుతోందని, ఆ పార్టీ నేతలూ పలు సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలే చేశారని స్పష్టం చేశారు. అప్పట్లో జనతా పార్టీ ఇలాగే వ్యవహరించిందని, దీంతో 1980లో ఇందిరా గాంధీని ప్రజలు మళ్లీ భారీ మెజారిటీతో ఎన్నుకున్నారని పేర్కొన్నారు. అడాల్ఫ్ హిట్లర్ మొదట్లో ఇలాగే చేశారని, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కేంద్ర ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలివ్వడమే కాకుండా స్వయంగా పర్యవేక్షిస్తోందని విమర్శించారు. నియంతృత్వాన్ని అంగీకరించేది లేదని, ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు.
సావర్కర్ కాదు.. ఆయన పేరు రాహుల్
‘ఆయనను సావర్కర్ అనుకుంటున్నారా? ఆయన పేరు రాహుల్ గాంధీ’ అని, ఎవరికీ తలొగ్గరని పేర్కొంటూ కేంద్రం తీరుపై కాంగ్రెస్ ట్విటర్లో విమర్శలు చేసింది. డ్రైవరు సీట్లో కూర్చున్న రాహుల్ గాంధీ చిత్రాన్ని ట్వీట్కు జత చేసింది. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. గొప్ప నేతలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.
సమాచారం ఇవ్వాల్సిందే: భాజపా
ఆరోపణలకు సంబంధించి రాహుల్ గాంధీ సమాచారం ఇవ్వాల్సిందేనని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండు చేశారు. ఆయన ఆరోపించిన సంఘటనలకు సంబంధించి పోలీసులకు ఆధారాలు కావాల్సి ఉందని, అందుకే రాహుల్ను వారు సంప్రదించారని పేర్కొన్నారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరిస్తుంటే కక్ష సాధింపని కాంగ్రెస్ వ్యాఖ్యానించడం తగదని హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య