రాహుల్ ఇంటి వద్ద హైడ్రామా
‘మహిళలు ఇంకా లైంగిక వేధింపులకు గురవుతున్నారు’ అన్న వ్యాఖ్యలపై వివరాల సేకరణ పేరుతో ఆదివారం దిల్లీ పోలీసులు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇంటికి వచ్చారు.
మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారన్న వ్యాఖ్యలపై వివరాల సేకరణకు పోలీసుల రాక
బయట కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత
గంటపాటు భేటీ అయి వివరాలడిగిన పోలీసులు
ఆ తర్వాత ప్రాథమిక సమాధానం పంపిన కాంగ్రెస్ అగ్రనేత
10 రోజుల్లో వివరంగా జవాబిస్తానని వెల్లడి
ఇప్పుడొచ్చి హడావుడి చేయడమేంటని ధ్వజం
దిల్లీ: ‘మహిళలు ఇంకా లైంగిక వేధింపులకు గురవుతున్నారు’ అన్న వ్యాఖ్యలపై వివరాల సేకరణ పేరుతో ఆదివారం దిల్లీ పోలీసులు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇంటికి వచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, బాధితుల వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చారని తెలియడంతో రాహుల్ ఇంటివద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనరు సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలోని పోలీసు బృందం ఉదయం 10 గంటలకు రాహుల్ ఇంటికి వచ్చింది. అప్పటికే ఆయన ఇంటిచుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు గంటలు వేచి ఉన్నాక రాహుల్ను కలిసిన పోలీసు బృందం బాధితుల వివరాలను కోరింది. మధ్యాహ్నం 1 గంటకు పోలీసులు వెళ్లిపోయారు. పోలీసులు ఉన్నప్పుడే కాంగ్రెస్ నేతలు పవన్ ఖేడా, అభిషేక్ మను సింఘ్వి, జైరాం రమేశ్ తదితరులు రాహుల్ ఇంటికి వచ్చారు. ఆయన ఇంటి బయట ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత విడిచి పెట్టారు. శ్రీనగర్లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా బాధితులు ఆయనను కలిసి ఫిర్యాదు చేస్తే ఆ వివరాలను ఇవ్వాలని, వారికి భద్రత కల్పిస్తామని అంటున్నారు. ఇప్పటికే స్థానికంగా ఎవరైనా బాధితులు ఉన్నారా అని విచారించామని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అందుకే రాహుల్ గాంధీని అడిగి వివరాలు తెలుసుకోవాలనుకున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఆయనను కలిసేందుకు వచ్చామని.. వివరాలిస్తే చర్యలకు సిద్ధమని హుడా తెలిపారు.
ప్రాథమిక సమాధానం పంపిన రాహుల్
దిల్లీ పోలీసుల నోటీసుపై ఆదివారం నాలుగు పేజీల ప్రాథమిక సమాధానాన్ని రాహుల్ గాంధీ పంపారు. 5 రోజుల్లో 3 సార్లు తనను కలిసేందుకు పోలీసులు రావడంపై ఆయన స్పందించారు. 10 రోజుల్లో పూర్తి వివరాలతో సమాధానం ఇస్తానని పేర్కొన్నారు. పోలీసుల తీరు దారుణమని, అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలా చేస్తున్నారా అని ఈ సందర్భంగా నిలదీశారు. తాను వ్యాఖ్యలు చేసిన 45 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి హడావుడి చేయడమేమిటని ప్రశ్నించారు.
హిట్లర్కేమైందో అందరికీ తెలుసు: కాంగ్రెస్
ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. రాజకీయ సభల్లో చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేయడంద్వారా భాజపా తప్పుడు సంకేతాలను పంపుతోందని, ఆ పార్టీ నేతలూ పలు సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలే చేశారని స్పష్టం చేశారు. అప్పట్లో జనతా పార్టీ ఇలాగే వ్యవహరించిందని, దీంతో 1980లో ఇందిరా గాంధీని ప్రజలు మళ్లీ భారీ మెజారిటీతో ఎన్నుకున్నారని పేర్కొన్నారు. అడాల్ఫ్ హిట్లర్ మొదట్లో ఇలాగే చేశారని, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కేంద్ర ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలివ్వడమే కాకుండా స్వయంగా పర్యవేక్షిస్తోందని విమర్శించారు. నియంతృత్వాన్ని అంగీకరించేది లేదని, ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు.
సావర్కర్ కాదు.. ఆయన పేరు రాహుల్
‘ఆయనను సావర్కర్ అనుకుంటున్నారా? ఆయన పేరు రాహుల్ గాంధీ’ అని, ఎవరికీ తలొగ్గరని పేర్కొంటూ కేంద్రం తీరుపై కాంగ్రెస్ ట్విటర్లో విమర్శలు చేసింది. డ్రైవరు సీట్లో కూర్చున్న రాహుల్ గాంధీ చిత్రాన్ని ట్వీట్కు జత చేసింది. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. గొప్ప నేతలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.
సమాచారం ఇవ్వాల్సిందే: భాజపా
ఆరోపణలకు సంబంధించి రాహుల్ గాంధీ సమాచారం ఇవ్వాల్సిందేనని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండు చేశారు. ఆయన ఆరోపించిన సంఘటనలకు సంబంధించి పోలీసులకు ఆధారాలు కావాల్సి ఉందని, అందుకే రాహుల్ను వారు సంప్రదించారని పేర్కొన్నారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరిస్తుంటే కక్ష సాధింపని కాంగ్రెస్ వ్యాఖ్యానించడం తగదని హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!