సంక్షిప్త వార్తలు(6)
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అధ్యక్షుడు నాసిర్ పాషాతో కలిపి 15 మందిపై ఎన్ఐఏతో కలిసి కర్ణాటకలోని కాడుగొండనహళ్లి పోలీసులు కోర్టులో 10,196 పేజీల అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. వీరిలో 9మందిపై యూఏపీఏ చట్టం కింద, మిగిలిన వారిపై ఐపీసీ 153 ఏ కింద కేసు నమోదైంది.
పీఎఫ్ఐ అధ్యక్షుడిపై ఎన్ఐఏ అభియోగపత్రం
బెంగళూరు, న్యూస్టుడే: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అధ్యక్షుడు నాసిర్ పాషాతో కలిపి 15 మందిపై ఎన్ఐఏతో కలిసి కర్ణాటకలోని కాడుగొండనహళ్లి పోలీసులు కోర్టులో 10,196 పేజీల అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. వీరిలో 9మందిపై యూఏపీఏ చట్టం కింద, మిగిలిన వారిపై ఐపీసీ 153 ఏ కింద కేసు నమోదైంది.
పొగ పీల్చిన వారిలో కరోనా తీవ్రత ఇంకా ఎక్కువ
దిల్లీ: పొగతాగే అలవాటు లేకపోయినా.. వేరేవారు పొగ తాగుతున్నప్పుడు దానిని పీల్చినవారికి (సెకెండ్ హ్యాండ్ స్మోకర్స్కి) కొవిడ్-19 ముప్పు తీవ్రత మరింత ఎక్కువ అని ఎయిమ్స్-గోరఖ్పుర్ అధ్యయనంలో వెల్లడైంది. ఆరు రాష్ట్రాల్లో తొలిసారిగా దీనిని నిర్వహించారు. ఇళ్లలో వేరేవాళ్లు ధూమపానం చేస్తున్నప్పుడు ఆ పొగ పీల్చడం వల్ల తీవ్ర కొవిడ్-19కు గురయ్యే అవకాశం 3.03 రెట్లు ఎక్కువని అధ్యయనంలో బయటపడింది. పని ప్రదేశాల్లో ఇలాంటి పరిణామం వల్ల ముప్పు 2.19 రెట్లు ఎక్కువని తేలింది. ఆరోగ్యపరంగా ఇలాంటి ముప్పు తలెత్తడమంటే జీవించే హక్కులోకి చొరబడడమే అవుతుందని ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేఖ కిశోర్ పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ధూమపానం ప్రభావానికి గురి కాకుండా ‘సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం-2003’ని సవరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. 2020 జనవరి నుంచి 2022 ఫిబ్రవరి మధ్య తీవ్ర కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరినవారిలో 18 ఏళ్లు పైబడినవారి వివరాలను దీనిలో విశ్లేషించారు. పొగతాగడం వల్ల కరోనా బారిన పడేందుకు, తీవ్రస్థాయి అస్వస్థతకు గురయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
అమర్త్యసేన్కు విశ్వభారతి షోకాజ్ నోటీసు
కోల్కతా: చట్ట విరుద్ధంగా ఆక్రమించినట్లుగా చెబుతున్న 5,662 చదరపు అడుగుల ప్లాటును ఖాళీ చేయవలసిందిగా మీకు ఉత్తర్వులు ఎందుకు జారీ చేయకూడదో చెప్పాలంటూ నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ (89)కు విశ్వభారతి (శాంతినికేతన్) విశ్వవిద్యాలయం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు మార్చి 24లోపు స్పందించాలని, అలాగే ఆ ప్లాటు ఆక్రమిత స్థలం కాకపోతే సంబంధిత ఆధారాలతో వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎస్టేట్ అధికారి, జాయింట్ రిజిస్ట్రార్ అయిన అశోక్ మహతో ముందు 29వ తేదీలోపు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఆయా తేదీల్లోపు నోటీసుకు స్పందించకపోతే కేసును ఏకపక్షంగా ముగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రముఖ ఆర్థికవేత్త అయిన అమర్త్యసేన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున విశ్వవిద్యాలయ నోటీసుపై ఆయన స్పందన ఏమిటన్నది తెలియరాలేదు.
మరో 19 మందిపై ఎన్ఐఏ చార్జిషీటు
దిల్లీ: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై ఎన్ఐఏ నమోదు చేసిన అయిదో చార్జిషీటులో 19 మందిపై అభియోగాలు మోపింది. ఇందులో 12 మంది ఆ సంస్థ జాతీయ కార్యనిర్వాహక మండలి సభ్యులు. దేశంలో ఇస్లామిక్ ఖలీఫా పాలన తెచ్చేందుకు యుద్ధం చేయాలంటూ పన్నిన కుట్రలో వీరి పాత్ర ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం దిల్లీలో ఎన్ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది.
బ్రిటన్ దౌత్యవేత్తకు సమన్లు
లండన్లో ఖలిస్థాన్ మద్దతుదారులు త్రివర్ణ పతాకాన్ని దించివేయడంపై నిరసన
దిల్లీ: లండన్లోని భారత రాయబార కార్యాలయం ఆవరణలోని త్రివర్ణ పతాకాన్ని కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు కిందకు దించిన ఘటనపై మనదేశం నిరసన వ్యక్తం చేసింది. దిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్త ఒకరిని ఆదివారం రాత్రి విదేశీ వ్యవహారాల శాఖ తమ కార్యాలయానికి పిలిపించి తీవ్ర ఆందోళనను తెలిపింది. సంఘటన సమయంలో భారత దౌత్యకార్యాలయ ప్రాంతానికి, అక్కడి సిబ్బందికి భద్రత లోపించడంపై పూర్తిస్థాయి వివరణ కోరింది. ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వ ఉదాశీనత ఆమోదనీయం కాదని తీవ్రంగా తెలిపింది. బ్రిటిష్ రాయబారి అలెక్స్ ఎలిస్ ప్రయాణంలో ఉండటంతో యూకే హైకమిషన్ డిప్యూటీ చీఫ్కు సమన్లు అందించింది. ఇదిలా ఉండగా లండన్లోని భారత రాయబార కార్యాలయం వద్ద జరిగిన చర్యలను ఖండిస్తున్నట్లు ఎలిస్ ట్విటర్లో తెలిపారు.
హరిచంద్ ఠాకుర్ ఆశయాలను నెరవేరుస్తాం
మతువా మహా సంఘానికి చెందిన ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ హరిచంద్ ఠాకుర్ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళి. అసమానతలను తొలగించి సామరస్యాన్ని పెంపొందించడంలో ఆయన పాత్ర అసమానమైనది. సామాజిక న్యాయం అవసరాన్ని ఆయన గట్టిగా వినిపించారు. ప్రజలకు విద్యను చేరువ చేయడానికి విశేష కృషి చేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు నిరంతరం పాటుపడతాం.
నరేంద్ర మోదీ
కశ్మీర్ ఘటనపై కేంద్రం స్పందించాలి
ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నతోద్యోగినని చెప్పుకొన్న గుజరాత్కు చెందిన ఓ వ్యక్తికి జమ్మూ-కశ్మీర్ అధికారులు జడ్ ప్లస్ భద్రత కల్పించి మరీ రాచ మర్యాదలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కశ్మీర్లో భద్రత మెరుగుపడిందని వల్లె వేస్తుంటారు. అలాంటప్పుడు ఈ ఘటన ఎలా జరిగింది. దేశ భద్రత దృష్ట్యా మోదీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి.
సీతారాం ఏచూరి
అభివృద్ధికి పెద్ద ఎత్తున పెట్టుబడులు
మేము ప్రజలపై ఇంధన ధరల భారాన్ని తగ్గిస్తున్నాం. తక్కువ ధరలో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. మంచి వేతనంతో ఉద్యోగాలు కల్పిస్తున్నాం. మెడికేర్ ద్వారా తక్కువ వ్యయానికే ఔషధాలు అందిస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాం.
బైడెన్
నిజమైన స్నేహితులెవరో తెలుసుకోండి
మీరు మారిపోతున్నారని కొందరు అసంతృప్తి చెందుతుంటారు. మీరు ఎదుగుతున్నారని మరికొందరు సంతోషిస్తుంటారు. నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకొని ముందుకు సాగడమే వివేకం. మార్పుతోనే పరిణతి సాధ్యమని గుర్తుంచుకోండి.
హర్ష్ గోయెంకా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM