Amritpal Singh: అమృత్పాల్ వెనుక ఐఎస్ఐ!
ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్పాల్సింగ్ వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) హస్తం, విదేశీ నిధుల ప్రమేయం ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. మాదకద్రవ్యాల ముఠాలతోనూ అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు.
విదేశీ నిధులూ అందుతున్నట్లు అనుమానం
ఐదుగురిపై ఎన్ఎస్ఏ కింద కేసు
నిందితుడి మామయ్య, డ్రైవరు లొంగుబాటు
చండీగఢ్: ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్పాల్సింగ్ వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) హస్తం, విదేశీ నిధుల ప్రమేయం ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. మాదకద్రవ్యాల ముఠాలతోనూ అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఈ ముఠాలే మెర్సిడెజ్ కారును సింగ్కు బహుమతిగా ఇచ్చాయనీ, ఆయుధ సహకారాన్ని ఐఎస్ఐ అందిస్తోందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తమ కన్నుగప్పి తప్పించుకున్నప్పుడూ ఇదే కారులో సింగ్ ఉన్నట్లు వారు గుర్తుచేశారు. నిందితుడికి ఓ ప్రైవేటు సైన్యం ఉందని తెలిపారు. ఐదుగురు వ్యక్తులపై ‘జాతీయ భద్రత చట్టం’ (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేసినట్లు పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుఖ్చైన్సింగ్ గిల్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇంతవరకు ఆరు కేసులు నమోదు చేసి, 114 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. శనివారం రాత్రి జలంధర్లో లొంగిపోయిన నిందితుని మామయ్య హర్జీత్సింగ్పైనా ఎన్ఎస్ఏ కేసు నమోదైందని, అతనినీ డిబ్రూగఢ్ జైలుకు తరలిస్తామని వివరించారు. అమృత్పాల్ను అరెస్టు చేశాక అతనిపైనా ఎన్ఎస్ఏ కేసు నమోదు చేస్తామన్నారు.
నకిలీ ఎన్కౌంటర్ చేస్తారేమోనన్న న్యాయవాది
ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అమృత్పాల్ మామయ్యతోపాటు డ్రైవర్ హర్ప్రీత్సింగ్ కూడా లొంగిపోయారు. మొబైళ్లలో అంతర్జాల సేవలు, ఎస్ఎంఎస్లపై నిషేధాన్ని మంగళవారం మధ్యాహ్నం వరకు పొడిగించారు. కొందరి ట్విటర్ ఖాతాలు స్తంభించిపోయాయి. అమృత్పాల్ను నకిలీ ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టేందుకు పోలీసులు యోచిస్తున్నారని, ఇప్పటికే అరెస్ట్ చేశారని ‘వారీస్ పంజాబ్ దే’ న్యాయవాది ఇమాన్సింగ్ ఖారా చెప్పారు.
సింగ్ రాటుదేలింది జార్జియాలో..
(ఇంటర్నెట్ డెస్క్): ఖలిస్థాన్ ఉద్యమకారుడు అమృత్పాల్ సింగ్ చరిత్ర తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. చాలాకాలం దుబాయ్లో ఉన్న అమృత్పాల్కు అక్కడే ఉగ్ర ముఠాలతో సంబంధాలు ఏర్పడ్డాయి.
ట్రక్కు డ్రైవరుగా దుబాయ్కి
అమృత్పాల్ 2012లో ట్రక్కు డ్రైవర్గా పనిచేసేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడే పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఖలిస్థాన్ నేత లఖ్బీర్ సింగ్ రోడే సోదరుడు జస్వంత్, ఉగ్రవాది పరమ్జీత్ సింగ్ పమ్మాతో పరిచయం ఏర్పడింది. దుబాయ్ నుంచి మన దేశానికి చేరుకోవడానికి ముందు అమృత్పాల్ జార్జియాకు వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అక్కడే ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ పొంది రాటుదేలినట్లు అనుమానిస్తున్నారు. పంజాబ్లో అశాంతి రేకెత్తించడానికి పక్కా వ్యూహంతోనే దేశంలో అడుగుపెట్టినట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత ‘వారిస్ పంజాబ్ దే’ను గుప్పిట్లోకి తీసుకుని వేగంగా ఎదిగాడు. ‘సిక్ ఫర్ జస్టిస్’ సంస్థతో కూడా సంబంధాలున్నాయి. పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా అమృత్పాల్కు ఆయుధాలు సమకూరినట్లు అనుమానిస్తున్నారు. బ్రిటన్కు చెందిన అవతార్ సింగ్ ఖండా అనే వ్యక్తి అమృత్పాల్కు ప్రధాన సహాయకారిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. అవతార్ సింగ్, పమ్మా మధ్య మంచి సంబంధాలున్నాయి. 2022 ఫిబ్రవరి వరకు అనామకుడిగా ఉన్న అమృత్పాల్ ఎదుగుదల వెనుక అవతార్ ప్రణాళికలు ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
కెనడా వీసాకు అమృత్పాల్ భార్య దరఖాస్తు
అమృత్పాల్ భార్య కిరణ్దీప్ కౌర్ ఇప్పటికే కెనడా వీసా కోసం దరఖాస్తు చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అమృత్పాల్ కూడా నేపాల్ మీదుగా కెనడాకు పారిపోయేందుకు ప్రయత్నించవచ్చని అనుమానిస్తున్నారు. సరిహద్దుల వద్ద తనిఖీలు, భద్రతను పటిష్ఠం చేయాలని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ)లను కేంద్రం ఆదేశించింది. కిరణ్దీప్ కౌర్ యూకేకు చెందిన ఎన్నారై. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారి పెళ్లి జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!