క్యాన్సర్‌, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

క్యాన్సర్‌, అధిక రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులకు అల్లోపతి విధానంలో చికిత్స లేదని, అదే ఆయుర్వేద వైద్యంతో వాటిని సమూలంగా నిర్మూలించవచ్చని యోగా గురువు రాందేవ్‌ బాబా  వ్యాఖ్యానించారు.

Published : 21 Mar 2023 05:36 IST

 

హరిద్వార్‌: క్యాన్సర్‌, అధిక రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులకు అల్లోపతి విధానంలో చికిత్స లేదని, అదే ఆయుర్వేద వైద్యంతో వాటిని సమూలంగా నిర్మూలించవచ్చని యోగా గురువు రాందేవ్‌ బాబా  వ్యాఖ్యానించారు. ఆవు పాలతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, వాటితో చాలా రోగాలు నయమవుతాయని చెప్పారు. తన సంస్థలో గోమూత్రం, ఆయుర్వేద ఔషధాల కలయికతో క్యాన్సర్‌ వంటి వ్యాధులను నయం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని రిషికుల్‌ ఆయుర్వేద కళాశాలలో నిర్వహించిన  సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు