అఫ్గాన్, పాకిస్థాన్లలో భూకంపం.. దిల్లీ సహా ఉత్తరాదిపై ప్రభావం
అఫ్గానిస్థాన్లోని హిందు-ఖుష్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.20 గంటలకు సంభవించిన భూకంపం ఆ దేశంలోనే కాకుండా చుట్టుపక్కల పలు దేశాలపై ప్రభావం చూపించింది.
హిందు-ఖుష్ కేంద్రంగా ప్రకంపనలు
చుట్టుపక్కల పలు దేశాల్లో కదిలిన భూమి
తీవ్రత 6.8 దాకా నమోదు
ఇస్లామాబాద్, దిల్లీ: అఫ్గానిస్థాన్లోని హిందు-ఖుష్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.20 గంటలకు సంభవించిన భూకంపం ఆ దేశంలోనే కాకుండా చుట్టుపక్కల పలు దేశాలపై ప్రభావం చూపించింది. తుర్క్మెనిస్థాన్, కజక్స్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, కిర్గిస్థాన్లలోనూ భూమి కంపించింది. పొరుగున ఉన్న పాకిస్థాన్పై, మన దేశ ఉత్తరాది రాష్ట్రాలపై ప్రభావం పడింది. అఫ్గాన్లో దీని తీవ్రత 6.6గా భూకంప లేఖినిపై నమోదైంది. భూకంప కేంద్రం ఆ దేశంలోని ఫాయిజాబాద్కు ఆగ్నేయంగా 133 కి.మీ. దూరంలో.. 180 కి.మీ.లోతున ఉన్నట్లు గుర్తించారు. పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్, ఝీలం, స్వాత్ తదితర ప్రాంతాల్లోనూ 6.8 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప సమయంలో పాకిస్థాన్లోని రావల్పిండి మార్కెట్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
భారత్లో..
దిల్లీ, హరియాణా, పంజాబ్, జమ్మూ-కశ్మీర్, రాజస్థాన్లలో అనేకచోట్ల భూ ప్రకంపనల ప్రభావం తెలియవచ్చింది. భూమి కంపించడంతో భయపడిన ప్రజలు ఆయా భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. డైనింగ్ టేబుల్తోపాటు ఇంట్లో ఫ్యాన్లు ఊగుతుండడాన్ని గమనించినట్లు నొయిడా నివాసి ఒకరు తెలిపారు. తీవ్రత ఎక్కువగా అనిపించిందనీ, ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయని మరికొందరు చెప్పారు. తమ ఇంట్లో టీవీ, సోఫా కదిలిపోవడంతో భూకంపం గురించి తెలిసిందని దిల్లీ దక్షిణ భాగంలోని లజ్పత్నగర్ నివాసి జ్యోతి తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తినష్టాలపై వెంటనే ఎలాంటి వివరాలు అందలేదు. జమ్మూ ప్రాంతంలో కొంతసేపు మొబైల్ఫోన్ల సేవలకు అంతరాయం కలిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది ‘రాజకీయ ప్రతీకారమే’ అని స్పష్టంగా అర్థమవుతుందని ఆమ్ఆద్మీ పార్టీ పేర్కొంది. -
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్పోర్టులో ఆందోళనకర ఘటన
ఎయిర్పోర్టు(Airport)లో ఆగిఉన్న ఒక విమానాన్ని మరో విమానం ఢీకొంది. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆందోళన వ్యక్తమైంది. -
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు
ఓ కండక్టర్ బస్సులోని మహిళా ప్రయాణికురాలిపై దాడి చేసిన వీడియో వైరలవడంతో అధికారులు ఆ కండక్టర్ను సస్పెండ్ చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. -
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
తన అరెస్టును సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఉపశమనం లభించలేదు. -
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్కు పోలింగ్ సిబ్బంది రెడీ!
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లోని ఓ మారుమూల గ్రామంలో ఓ మహిళా ఓటరు కోసం పోలింగ్ సిబ్బంది దాదాపు 39 కి.మీ.ల దూరం ట్రెక్కింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. -
మయన్మార్ సరిహద్దుల్లో కంచె.. రూ.30,000 కోట్ల ఖర్చు..!
India - Myanmar: భారత్-మయన్మార్ సరిహద్దుల్లో 1600 కిలోమీటర్ల కంచె నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.30వేల కోట్లు వెచ్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
‘సునీత.. రబ్రీ దేవిలా మారనున్నారా?’.. వీడియో సందేశంపై భాజపా విమర్శలు!
ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఇచ్చిన సందేశాన్ని సునీత వినిపించడంపై విమర్శలు గుప్పించిన భాజపా.. బిహార్లో రబ్రీ దేవి మాదిరిగా ఆమె కూడా మారనున్నారనే అనుమానం వ్యక్తం చేసింది. -
కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. నెట్టింట్లో వైరల్గా మారిన ఫొటో
ఓ రాజకీయ నేతకు చెందిన ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది. అందులో ఆయన కరెన్సీ నోట్ల (Currency notes) పై హాయిగా నిద్రిస్తుండటమే కారణం. -
కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ వర్గాల వెల్లడి
Arvind Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆప్ వర్గాలు ఆరోపించాయి. -
కేరళ సీఎం కుమార్తెపై మనీలాండరింగ్ కేసు
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తెపై ఈడీ పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. దీని విచారణకు సంబంధించి త్వరలో సమన్లు జారీ చేయనుంది. -
దిలీప్ ఘోష్కు భాజపా షోకాజ్ నోటీసులు.. క్షమాపణలు చెప్పిన ఎంపీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎంపీ దిలీప్ ఘోష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై వివరణ కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆయనకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఘోష్ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. -
నిరుద్యోగ సమస్యపై ‘సీఈఏ’ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్
‘అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదు’ అని ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర అభ్యంతరం
Kejriwal arrest: దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. దిల్లీలోని ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ రేపు కోర్టులో చెబుతారు: సతీమణి సంచలన ప్రకటన
Sunita Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీత మరో వీడియో సందేశం విడుదల చేశారు. ఈ కేసుకు సంబంధించి నిజాలన్నీ ఆయన గురువారం కోర్టులో బయటపెడతారని చెప్పారు. -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ హతం
Encounter: బీజాపుర్ జిల్లాలో బుధవారం ఎన్కౌంటర్ జరిగింది. ఆరుగురు మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో మునావర్ ఫరూఖీ
బిగ్బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ(Munawar Faruqui)ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
బిహార్లో ఒకే ఇంట్లో ఏడుగురు ‘పోలీస్’ సిస్టర్స్..
బిహార్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు - అబ్కారీ శాఖల్లో, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. -
ఓటీపీ మోసాలకు సరికొత్త విరుగుడు
ఆధునిక కాలంలో ఓటీపీ మోసాలు, పాస్వర్డ్ హ్యాకింగ్ ఉదంతాలు ఎక్కువయ్యాయి. వీటి కట్టడికి హిమాచల్ ప్రదేశ్లోని మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
గాజా వివాదంపై అమెరికా తీరుకు నిరసన.. పీహెచ్డీ డిగ్రీనీ వెనక్కి ఇచ్చేసిన సందీప్పాండే
దాదాపు ఆర్నెల్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గత జనవరిలో రామన్ మెగసెసె అవార్డు వదులుకొంటున్నట్లు ప్రకటించిన సామాజిక ఉద్యమకారుడు సందీప్పాండే బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి తాను చేసిన పీహెచ్డీ డిగ్రీని సైతం తాజాగా వెనక్కు ఇచ్చేశారు. -
భాజపా మాయ నుంచి యువత బయటకు రావాలి
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని భాజపా నిలబెట్టుకోలేదు. అబద్ధపు వాగ్దానం ఎందుకు చేశారని యువత ఇప్పుడు ఆ పార్టీని ప్రశ్నిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నవనీత్ రాణాకు భాజపా టికెట్ .. ఆ సీటు నుంచే బరిలోకి..
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
-
హైదరాబాద్ సంచలనం.. ఐపీఎల్ రికార్డు బద్దలు
-
తెదేపా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM