కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
కన్నతండ్రి కనుమూయడం ఆ కుమారుడికి తీరని వేదన మిగిల్చింది. అదీ తాను పెళ్లి చేసుకునే గడువు సమీపించిన సమయంలో శాశ్వతంగా దూరమవడంతో కన్నీరుమున్నీరయ్యాడు.
ప్యారిస్ (చెన్నై), న్యూస్టుడే: కన్నతండ్రి కనుమూయడం ఆ కుమారుడికి తీరని వేదన మిగిల్చింది. అదీ తాను పెళ్లి చేసుకునే గడువు సమీపించిన సమయంలో శాశ్వతంగా దూరమవడంతో కన్నీరుమున్నీరయ్యాడు. తన పెళ్లి చూడాలన్న తండ్రి కోరికను ఎలాగైనా తీర్చాలని తలపోశాడు. ఆయన భౌతికకాయం ముందే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని కళ్లక్కురిచ్చిలో చోటుచేసుకుంది. కళ్లక్కురిచ్చి సమీపం పెరువంగూర్ గ్రామానికి చెందిన పంచాయతీ యూనియన్ అధ్యక్షురాలు అయ్యమ్మాళ్ భర్త రాజేంద్రన్ అనారోగ్యంతో సోమవారం చనిపోయారు. ఆయన కుమారుడు ప్రవీణ్కు 27వతేదీన పెళ్లి ఉంది. రాజేంద్రన్ అంత్యక్రియలకు చెన్నైకి చెందిన వధువు స్వర్ణమాల్య తన కుటుంబంతో సహా వచ్చారు. తండ్రి భౌతికకాయం సమక్షంలోనే పెళ్లి చేసుకుందామని ప్రవీణ్ కోరారు. ఆమె కూడా అంగీకరించడంతో ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో అక్కడే పెళ్లి చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..