భారత్‌లో రేపట్నుంచి రంజాన్‌ ఉపవాసాలు

భారత్‌లో బుధవారం సాయంత్రం నెలవంక కనిపించకపోవడంతో రంజాన్‌ నెల ఉపవాసాలు శుక్రవారం ఉదయం నుంచి మొదలుకానున్నాయి.

Published : 23 Mar 2023 02:31 IST

పలు దేశాల్లో గురువారం నుంచే..

దిల్లీ: భారత్‌లో బుధవారం సాయంత్రం నెలవంక కనిపించకపోవడంతో రంజాన్‌ నెల ఉపవాసాలు శుక్రవారం ఉదయం నుంచి మొదలుకానున్నాయి. దిల్లీలోని బహదూర్‌షా జఫర్‌ మార్గ్‌లో జరిగిన రుయత్‌ ఏ హిలాల్‌, ఇమారత్‌ ఏ షరియా-హింద్‌ కమిటీల సమావేశంలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. దేశ రాజధాని దిల్లీలో కానీ, మరే ప్రాంతంలో కానీ భారత్‌లో బుధవారం రాత్రి నెలవంక కనిపించలేదని జమియత్‌ ఉలేమా ఏ హింద్‌ ప్రకటించింది. కాగా, ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేసియాలో నెలవంక కనిపించినట్లు ప్రకటించగానే బుధవారం సాయంత్రం ప్రార్థనలు మొదలయ్యాయి. సౌదీ అరేబియాతోపాటు పలు మధ్య ప్రాచ్య దేశాల్లోనూ బుధవారం రాత్రితో రంజాన్‌ నెల మొదలైనట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ దేశాల్లో గురువారం నుంచి ఉపవాసాలు ఉంటాయి. చాంద్రమాన క్యాలెండర్‌ను అనుసరించే ఇస్లాం సంప్రదాయం ప్రకారం.. నెలవంక కనిపించగానే ఏటా రంజాన్‌ నెల ప్రారంభమవుతుంది. ఒక్కోసారి ఇది కొన్ని దేశాల్లో ఒకరోజు వెనుకాముందుగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని