అమృత్పాల్కు వివాహేతర సంబంధాలు
ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్కు సంబంధించి రోజురోజుకూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఖలిస్థాన్ గురించి మాట్లాడే అతనికి చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
బయటపడిన ఛాటింగ్లు, వాయిస్ నోట్లు
అతడి గతచరిత్రను తవ్వుతున్న పోలీసులు
పంజాబ్లో కల్లోలం సృష్టించే ప్రణాళికలో ఉన్నాడని నిఘా వర్గాలు గుర్తింపు
ఆశ్రయమిచ్చిన ఓ మహిళ అరెస్టు
చండీగఢ్: ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్కు సంబంధించి రోజురోజుకూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఖలిస్థాన్ గురించి మాట్లాడే అతనికి చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి మహిళలతో ఛాటింగ్లు, వాయిస్నోట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 12 వాయిస్ నోట్లు ఓ మీడియా సంస్థ చేతికి వచ్చాయి. వాటిల్లో మహిళలతో టైంపాస్ కోసం సంబంధాలు పెట్టుకొంటున్నట్లు అతడు చెబుతున్న మాటలు ఉన్నాయి. ఈ మహిళల్లో కొందరు వివాహితలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అతడి ఇన్స్టాగ్రామ్ సందేశాల్లో ఓ మహిళను వివాహేతర సంబంధం గురించి అడుగుతున్నట్లు ఉంది.
అమృత్పాల్ సింగ్ కోసం వేటను కొనసాగిస్తున్న పోలీసులు మరోపక్క అతడి గత చరిత్రను తవ్వితీస్తున్నారు. అతడి దేశ వ్యతిరేక అజెండాను కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు బట్టబయలు చేసేపనిలో ఉన్నాయి. తాజాగా అమృత్పాల్ తన బైకును మరో వాహనంపై పెట్టి ప్రయాణిస్తున్న చిత్రాలను పోలీసులు గుర్తించారు. అతడి భార్య, తల్లిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
పాక్ నుంచి ఆయుధాల సేకరణ
అమృత్పాల్ పాకిస్థాన్ నుంచి ఆయుధాలు సేకరించే పనిలో ఉన్నాడని ఓ ఇంటెలిజెన్స్ అధికారి ‘ఎన్డీటీవీ’కి వెల్లడించారు. దీంతోపాటు పంజాబ్లో కల్లోలం సృష్టించాలనే ప్రణాళికతో అతడు పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. పాక్ ఐఎస్ఐ సాయంతో ఇప్పటికే తెప్పించిన ఆయుధాలను డీఅడిక్షన్ సెంటర్లు, జల్పూర్ ఖేడా వద్ద కొన్ని ప్రార్థనా మందిరాల్లో భద్రపర్చినట్లు సమాచారం. దీంతోపాటు అక్రమ ఆయుధాల తరలింపు, తుపాకులను బహిరంగంగా ప్రదర్శించడం వంటి పనులు చేశాడు.
సేకరించిన సొమ్ముకు లెక్కాపత్రం లేదు..
‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ ఆధ్వర్యంలో ఖల్సా వాహీర్ వంటి కార్యక్రమం నిర్వహించి సేకరించిన మొత్తానికి అమృత్పాల్ వద్ద ఎటువంటి లెక్కాపత్రం లేదు. ఖలిస్థాన్ పేరిట సేకరించిన సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాడని అధికార వర్గాలు చెప్పాయి.
ఇతర రాష్ట్రాల వారిపై అసహనం పెంచడం..
పంజాబ్ సమాజాన్ని మతం ఆధారంగా విడదీయడం అమృత్పాల్ అజెండాగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్, బిహార్ నుంచి పొట్టపోసుకొనే కూలీలపై స్థానికంగా వ్యతిరేకత పెంచేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆనందర్పూర్ ఖల్సా ఫౌజీ సాయంతో ఇతర మతాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఉద్రిక్తతలు పుట్టించాలన్నది అమృత్పాల్ ప్రణాళికగా తెలుస్తోంది. దీంతోపాటు పంజాబ్ యువతలో తుపాకీ సంస్కృతిని పెంచేందుకు అమృత్పాల్ ప్రయత్నించాడు. అందుకోసం గురువుల బోధనలను వక్రీకరించేందుకు యత్నించాడు.
మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం..
అమృత్పాల్ వేట ఇప్పుడు మహారాష్ట్రకు కూడా విస్తరించింది. తాజాగా నాందేడ్ పోలీసులు అప్రమత్తమై వాహనాల రాకపోకలపై దృష్టిపెట్టారు. దీంతోపాటు మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు కూడా హైఅలర్ట్లో ఉన్నారు. ఇప్పటికే అమృత్పాల్కు సంబంధించిన ఏడు రకాల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.
పంజాబ్ పోలీసులకు నిందితురాలి అప్పగింత
హరియాణా కురుక్షేత్ర జిల్లాలో అమృత్పాల్కు ఆశ్రయం ఇచ్చిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను బల్జీత్ కౌర్గా పేర్కొన్న హరియాణా పోలీసులు... అమృత్పాల్, అతని సహచరుడు పాపల్ప్రీత్ సింగ్కు ఆదివారం షాహాబాద్లోని తన ఇంట్లో ఆ మహిళ ఆశ్రయం ఇచ్చిందని చెప్పారు. నిందితురాలిని పంజాబ్ పోలీసులకు అప్పగించినట్లు వివరించారు.
ప్రైవేటు సెక్యూరిటీ గార్డు అరెస్టు
అమృత్పాల్ సింగ్ ప్రైవేట్ సెక్యూరిటీలో భాగమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లూధియానా జిల్లాలోని ఖన్నా ప్రాంతంలోని మంగేవాల్ గ్రామానికి చెందిన తేజిందర్ సింగ్ గిల్... అమృత్పాల్ సింగ్కు వ్యక్తిగత భద్రత కల్పించే వారిలో ఒకరని చెప్పారు. అమృత్ కోసం గాలిస్తున్న క్రమంలో నిందితుడు చిక్కినట్లు వివరించారు. మరోవైపు, పోలీసులు అదుపులోకి తీసుకున్న అమృత్పాల్ సింగ్ సోదరుడు హర్ప్రీత్ సింగ్తో పాటు 11 మంది సహచరులను గురువారం పంజాబ్లోని బాబా బకాలా కోర్టులో హాజరుపరిచారు. ఆయుధాల కేసులో అంతకుముందు న్యాయస్థానం.. వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు పంపగా గురువారంతో గడువు ముగిసింది.
ప్రత్యేక సెల్, భద్రత
అసోంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న అమృత్పాల్ సింగ్ మేనమామ హర్జిత్ సింగ్, ఏడుగురు అనుచరులను ప్రత్యేక జైలు గదుల్లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. వారందరినీ సీసీటీవీ నిఘా పరిధిలో ఉంచారు. జైలు వెలుపలి ప్రాంతానికి భద్రత కల్పించే బాధ్యతను ఎలైట్ బ్లాక్ పాంథర్ అసోం పోలీసు కమాండోల బృందానికి అప్పగించామని ఉన్నతాధికారులు తెలిపారు. కారాగారం అంతర్గత భద్రతా బాధ్యతలను, అసోం పోలీసు సిబ్బంది, జైలు గార్డులకు ఇచ్చినట్లు వివరించారు.
ఇంటర్నెట్ ఆంక్షల సండలింపు...
అమృత్పాల్ సింగ్ కోసం వేట ప్రారంభించినప్పుడు నిలిపేసిన మొబైల్ ఇంటర్నెట్ సేవలను అమృత్సర్లోని మోగా, సంగ్రూర్, అజ్నాలా, మొహాలిలోని కొన్ని ప్రాంతాల్లో తిరిగి పునరుద్ధరించారు. తరన్ తారన్, ఫిరోజ్పూర్ జిల్లాల్లో మాత్రం నిలిపివేతను శుక్రవారం మధ్యాహ్నం వరకు పొడిగించారు.
దర్యాప్తునకు ఆదేశించిన ఛత్తీస్గఢ్ సీఎం
రాయ్పుర్: ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పుర్లో ఖలిస్థాన్ అనుకూలురు ర్యాలీ నిర్వహించిన ఘటనపై ముఖ్యమంత్రి భుపేశ్ బఘేల్ గురువారం పోలీసు దర్యాప్తునకు ఆదేశించారు. సంఘవిద్రోహ కార్యకలాపాలను ఉపేక్షించేదిలేదని ఆయన అసెంబ్లీలో తెలిపారు. నిందితులపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్