Rahul Gandhi : రాహుల్పై వేటు నిలబడుతుందా..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష ఖరారవడం, ఆయనపై లోక్సభ సచివాలయం అనర్హత వేటు వేయడం చకచకా జరిగిపోయాయి.
ఉన్నత న్యాయస్థానంలో అప్పీలుకు వెళ్తే ఏం జరుగుతుంది?
మహమ్మద్ ఫైజల్ కేసులో ఏమైందంటే..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష ఖరారవడం, ఆయనపై లోక్సభ సచివాలయం అనర్హత వేటు వేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత ఏం జరగబోతోందన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్ 8 ఏళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాల్సిందేనా? పైకోర్టులో అప్పీలు చేసుకుంటే అనర్హత వేటు తొలగిపోయే అవకాశాలేమైనా ఉన్నాయా? వంటి ప్రశ్నలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో- రాహుల్ తరహా పరిస్థితులు ఎదుర్కొన్న లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ కేసులో ఏం జరిగిందో ఓసారి పరిశీలిద్దాం.
ఏంటీ ఫైజల్ కేసు?
పి.పి. మహమ్మద్ ఫైజల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన లక్షద్వీప్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే 2009 లోక్సభ ఎన్నికల సమయంలో మహమ్మద్ సలీహ్ అనే కాంగ్రెస్ నాయకుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై ఫైజల్పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా సాగింది. చివరకు ఈ ఏడాది జనవరి 10న కవరత్తీ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. హత్యాయత్నం కేసులో ఫైజల్ను దోషిగా తేల్చి.. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో- ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్సభ సచివాలయం నుంచి జనవరి 13న ఓ ప్రకటన వెలువడింది. ఫైజల్పై వేటు కారణంగా ఖాళీ అయిన లక్షద్వీప్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
హైకోర్టులో ఉపశమనం
సెషన్స్ కోర్టు తీర్పును వెంటనే కేరళ హైకోర్టులో ఫైజల్ సవాలు చేశారు. అక్కడ ఆయనకు ఉపశమనం లభించింది. సెషన్స్ కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానం నిలిపివేసింది. స్టే కారణంగా.. ఆయనకు అనర్హత వేటు వర్తించదని తెలిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫైజల్పై అనర్హత వేటుతో తలెత్తే అసాధారణ, మార్చలేని పరిణామాల దృష్ట్యా తాము ఆ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. దేశ ఖజానాకు భారమయ్యే ఉప ఎన్నికను నివారించేందుకు ఇలా చేయడం అవసరమని చెప్పింది. ఉప ఎన్నికల వల్ల లక్షద్వీప్లో అభివృద్ధి పనులు కొన్ని వారాలపాటు ఆగిపోతాయంది. కొత్తగా ఎన్నికయ్యే ఎంపీ పదవీకాలం కూడా తక్కువే ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులకు రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడితే అనర్హత వేటు ఆటోమేటిక్గా అమల్లోకి వస్తుందని, పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించలేమని నాడు కేంద్రం చేసిన వాదనలను హైకోర్టు అంగీకరించలేదు. లోక్ప్రహారీ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో 2018 నాటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం గుర్తుచేసింది. అప్పటి నిర్ణయం ప్రకారం.. ప్రజాప్రతినిధిని దోషిగా తేల్చడంపై స్టే విధిస్తే.. అనర్హత వేటు వర్తించదని స్పష్టం చేసింది. మరోవైపు- లక్షద్వీప్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఫైజల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఫలితంగా ఉప ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
అయినా సందిగ్ధతే
ఫైజల్కు అనర్హత వేటు వర్తించదని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ.. ఆయన సభ్యత్వాన్ని లోక్సభ సచివాలయం పునరుద్ధరించలేదు. ఫలితంగా ఈ కేసులో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు దోషిగా తేలి రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడితే అనర్హత వేటు పడుతుందని ఓ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేయగా.. అప్పీలుపై స్పష్టత వచ్చేవరకూ అది వర్తించదని హైకోర్టు పేర్కొంది. ఈ సందిగ్ధత నడుమ రాహుల్ అప్పీలుకు వెళ్తే ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
జైలు శిక్ష తీర్పు తర్వాత.. లోక్సభకు రాహుల్ గాంధీ
దిల్లీ: మోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి జైలుశిక్ష పడిన నేపథ్యంలో శుక్రవారం ఆయన పార్లమెంటుకు వస్తారా.. రారా..! అన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఉదయమే పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్ హాజరయ్యారు. ఆ తర్వాత లోక్సభకూ వెళ్లారు. అదానీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగడంతో సభ.. సమావేశమైన కొన్ని క్షణాలకే వాయిదా పడింది. దీంతో రాహుల్ పార్లమెంటును విడిచి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.