లోయలోకి దూసుకెళ్లిన శబరిమల యాత్రికుల బస్సు
కేరళలోని పథనంతిట్ట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది.
కేరళలో 62 మందికి తీవ్ర గాయాలు
కేరళలోని పథనంతిట్ట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 62 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో డ్రైవర్ సహా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 9 మంది చిన్నారులు సహా మొత్తం 64 మంది ఉన్నారు. వారంతా తమిళనాడులోని మయిలాదుతురయ్ జిల్లా వాసులని అధికారులు గుర్తించారు. శబరిమల ఆలయాన్ని దర్శించుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్తుండగా వారు ప్రమాదం బారిన పడ్డారు. పథనంతిట్ట జిల్లా నిలక్కల్ సమీపంలోని ఇలావుంకల్ వద్ద మంగళవారం మధ్యాహ్నం బస్సు బోల్తా పడి లోయలోకి దూసుకెళ్లింది. స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను కొట్టాయం వైద్య కళాశాల ఆసుపత్రి సహా పలు వైద్యశాలలకు తరలించారు. పైంకుని పండగను పురస్కరించుకుని శబరిమల ఆలయాన్ని దేవస్థానం బోర్డు సోమవారం తెరిచిన సంగతి గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/06/23)
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!
-
Sports News
WTC Final: ఫామ్పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్సర్కార్
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Sports News
Virat Kohli: ‘మిడిల్ ఆర్డర్కు వెన్నెముక.. ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు’