విద్వేష ప్రసంగాలు విషవలయాలు
మతాన్ని రాజకీయాలతో మిళితం చేయడంతోనే ప్రధాన సమస్య ఎదురవుతోంది. ఆ రెండింటినీ వేరు చేస్తే సమస్య కనుమరుగవుతుంది.
రాజకీయాలకు మతాన్ని వాడుకోవడం మానేస్తే వాటికి అడ్డుకట్టపడుతుంది
సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
మతాన్ని రాజకీయాలతో మిళితం చేయడంతోనే ప్రధాన సమస్య ఎదురవుతోంది. ఆ రెండింటినీ వేరు చేస్తే సమస్య కనుమరుగవుతుంది. రాజకీయ నాయకులు మతాన్ని ఉపయోగించుకోవడం విరమించాలి. రాజకీయాలను మతంతో ముడిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
సుప్రీం ధర్మాసనం
దిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి ఇవి ప్రమాదకరమని హెచ్చరించింది. రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయాలని స్పష్టం చేసింది. అలాగైతేనే రెచ్చగొట్టే ఉపన్యాసాలకు తెర పడుతుందని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. విద్వేష ప్రసంగాలపై కోర్టు ధిక్కరణ చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్పై బుధవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మాజీ ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయీ ప్రసంగాలను ఉదహరించిన ధర్మాసనం.. వారి మాటలు వినేందుకు మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచీ ప్రజలు వచ్చేవారని గుర్తు చేసింది. అన్ని వర్గాల ప్రజలు విద్వేష ప్రసంగాలు చేయకుండా ప్రతిజ్ఞ ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. రోజూ ఎవరో ఒకరు ఇతరులను అవమానించేలా విద్వేష వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నా రాష్ట్రాలు వారిపై కేసులు నమోదు చేయడంలో విఫలం అవుతున్నాయని అసహనం వ్యక్తం చేసింది. నాయకులు రాజకీయాలతో మతాన్ని మిళితం చేయడంతోనే అసలు సమస్య వస్తోందని పేర్కొంది. మతాన్ని అడ్డుపెట్టుకొని చేసే రాజకీయాలు దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ప్రస్తుత కేసులో కక్షిదారుగా చేరుతామంటూ హిందూ సమాజ్ సంస్థ చేసుకున్న అభ్యర్థనను ధర్మాసనం అనుమతించింది. ఈ సంస్థ మహారాష్ట్రలో నిర్వహించిన కార్యక్రమాలు, వాటిలో చేసిన వివాదాస్పద ప్రకటనలు విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. చట్టాలను ఉల్లంఘిస్తూపోతే అందరితో పాటు మీకూ తీవ్ర నష్టం కలిగిస్తాయని సంస్థ తరఫు వ్యక్తులను హెచ్చరించింది. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, అగ్రరాజ్యంగా అవతరించాలంటే చట్టబద్ధమైన పాలన కొనసాగాలని, నివాస యోగ్యమైన దేశంగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది. విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోవాలని నిరంతరంగా కేసులు నమోదవుతూ ఉంటే న్యాయస్థానాలు ఎన్నిటిని విచారించగలవని ప్రశ్నించింది. ఈ తరహా నేరాలు ఆగిపోవాలంటే ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని, ఇందుకు పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలని తెలిపింది.
సొలిసిటర్ జనరల్ అభ్యంతరాలు
విద్వేష ప్రసంగాలపై పిటిషన్ దాఖలు చేసిన షహీన్ అబ్దుల్లా ఎంపిక చేసిన కొన్ని ఉపన్యాసాలను మాత్రమే ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించారు. కేరళలోని ఒక ఘటనను, తమిళనాడులో డీఎంకే నాయకుడు చేసిన ప్రకటనను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వాటిని పిటిషనర్ ఎందుకు జతచేయలేదని నిలదీశారు. ఆ రెండు రాష్ట్రాలకు ధర్మాసనం నోటీసులెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ధర్మాసనం...మెహతా మధ్య వాడివేడి సంభాషణ జరిగింది. చర్యకు ప్రతిచర్య ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. విద్వేష ప్రసంగాలు విషవలయాల వంటివని తెలిపింది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరించాల్సి ఉంటుందని చెబుతూ... విద్వేష ప్రసంగాలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా మౌనం వహించడం వల్లే కోర్టు ధిక్కరణ కేసును విచారణకు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. తుషార్ మెహతా స్పందిస్తూ పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వానికి నోటీసు జారీ చేయాలని కోరారు. కొన్ని ప్రసంగాల వీడియో క్లిప్పులను ప్రదర్శించేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది. ‘విచారణను ఒక డ్రామాగా మార్చొద్దు. వీడియో క్లిప్పులను చూడడానికి ఒక పద్దతి ఉంటుంది. అది అందరికీ సమానంగా వర్తిస్తుంది. కావాలంటే ఆ వీడియోలను మీ పత్రాలతో జతచేసి సమర్పించవచ్చు’అని బదులిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ స్పందనను తెలియజేయాల్సిందిగా ఆదేశించింది.
విద్వేష ప్రసంగాలపై కోర్టు ధిక్కరణ చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు విద్వేషపూరిత ప్రసంగాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం