సరైన సమాచారమే ప్రజాస్వామ్యానికి ఊపిరి
సరైన సమాచారం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. తప్పుడు వార్తలు/సమాచారంపై తగిన విధంగా చర్యలు తీసుకుని, వాటిని కట్టడి చేసేందుకు సిద్ధం కావాలని ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) అధికారులకు రాష్ట్రపతి సూచించారు.
ఐఐఎస్ అధికారులతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
దిల్లీ: సరైన సమాచారం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. తప్పుడు వార్తలు/సమాచారంపై తగిన విధంగా చర్యలు తీసుకుని, వాటిని కట్టడి చేసేందుకు సిద్ధం కావాలని ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) అధికారులకు రాష్ట్రపతి సూచించారు. శిక్షణలో ఉన్న అధికారులతో పాటు కొందరు ఐఐఎస్ అధికారులు బుధవారం తనను కలిసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుత సమయంలో సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, అందువల్ల అంతే వేగంగా తప్పుడు సమాచారం కూడా వెళ్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. తప్పుడు సమాచారంపై పోరాడే బాధ్యతను అధికారులు తీసుకోవాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నిబద్ధతతో పనిచేయాలన్నారు. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసి తప్పుడు కథనాలు ప్రచారం చేసేవారిని అడ్డుకోవాలని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని