అయిదు నెలల తర్వాత.. 2 వేలకు పైగా కొత్త కేసులు

దేశంలో కరోనా రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 2,151 కొవిడ్‌ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Published : 30 Mar 2023 05:53 IST

దిల్లీ: దేశంలో కరోనా రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 2,151 కొవిడ్‌ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత అయిదు నెలల కాలంలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని పేర్కొంది. గతేడాది అక్టోబరు 28న 2,208 కొత్త కేసులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా వైరస్‌ నుంచి కోలుకోలేక ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,848కి చేరగా.. కరోనా బాధితుల సంఖ్య 4.47 కోట్లు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,903 క్రియాశీలక కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని