Ballari: బళ్లారి నగర పాలికె మేయర్‌గా 23 ఏళ్ల యువతి

కర్ణాటక రాష్ట్రం బళ్లారి నగర పాలికె మేయర్‌గా 23 ఏళ్ల డి.త్రివేణి బాధ్యతలు చేపట్టనున్నారు.

Updated : 30 Mar 2023 07:09 IST

బళ్లారి, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రం బళ్లారి నగర పాలికె మేయర్‌గా 23 ఏళ్ల డి.త్రివేణి బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగో వార్డు కార్పొరేటర్‌గా ఉన్న ఆమె మేయర్‌ పీఠానికి బుధవారం జరిగిన ఓటింగ్‌లో విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన త్రివేణి 18 ఏళ్లకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విమ్స్‌ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్‌ఫార్మసీ పూర్తి చేశారు. ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నానని, కార్పొరేటర్ల సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ త్రివేణి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని