Ramayanam: 530 పేజీల బంగారు రామాయణం!
గుజరాత్ రాష్ట్రం సూరత్లోని ఓ ఆలయంలో బంగారు రామాయణాన్ని చూడవచ్చు. ఇందులో ఉన్న అక్షరాలను 19 కిలోల బంగారంతో తయారు చేశారు.
గుజరాత్ రాష్ట్రం సూరత్లోని ఓ ఆలయంలో బంగారు రామాయణాన్ని చూడవచ్చు. ఇందులో ఉన్న అక్షరాలను 19 కిలోల బంగారంతో తయారు చేశారు. ఈ బంగారు మహాకావ్య రచనకు 530 పేజీలను ప్రత్యేకంగా జర్మనీ నుంచి తెప్పించారు. 222 తులాల బంగారు సిరా వినియోగించారు. పుస్తకం బరువు సుమారు 19 కిలోల వరకు ఉంటుంది. బంగారంతోపాటు 10 కిలోల వెండి, 4 వేల వజ్రాలు, కెంపులు, పచ్చలు, నీలమణులతో ఈ రామాయణాన్ని చూడముచ్చటగా అలంకరించారు. దీని విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఈ రామాయణ రచనకు 1981లో రామ్భాయ్ అనే భక్తుడు ప్రత్యేకించి పుష్యమీ నక్షత్రంలో శ్రీకారం చుట్టారు. రాయడానికి మొత్తం 9 నెలల 9 గంటల సమయం పట్టింది. ఈ మహాయజ్ఞంలో మొత్తం 12 మంది రామభక్తులు సహకరించారు. శ్రీరామనవమి రోజున మాత్రమే భక్తుల దర్శనం కోసం ప్రదర్శించే ఈ రామాయణాన్ని ఆ తర్వాత ఏడాదంతా ప్రత్యేక బ్యాంకులో భద్రపరుస్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!
-
Sports News
WTC Final: ఫామ్పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్సర్కార్
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Sports News
Virat Kohli: ‘మిడిల్ ఆర్డర్కు వెన్నెముక.. ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు’
-
Movies News
Social Look: శ్రీలంకలో మృణాళిని రవి సెల్ఫీ.. విష్ణుప్రియ ‘ఎల్లో’ డ్రెస్సు