టేకాఫ్‌ కాగానే ఢీకొన్న పక్షి.. దిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ

దుబాయ్‌ వెళ్లాల్సిన విమానాన్ని దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో పక్షి ఢీకొట్టడంతో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ ప్రకటించారు.

Published : 02 Apr 2023 04:07 IST

దుబాయ్‌ వెళ్లాల్సిన విమానాన్ని దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో పక్షి ఢీకొట్టడంతో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ ప్రకటించారు. రన్‌వే నుంచి ఫెడెక్స్‌ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టింది. అప్రమత్తమైన పైలట్లు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి, ల్యాండింగుకు అనుకూల పరిస్థితులు కల్పించాల్సిందిగా కోరారు. దీంతో ఆ సమయంలో దిగాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లించారు. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానాలను సైతం నిలిపివేసి ఫెడెక్స్‌ విమానం ల్యాండింగుకు మార్గం సుగమం చేశారు. విమానం సురక్షితంగా కిందికి దిగగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక సిబ్బంది వెంటనే మరమ్మతులు చేశారు. అంతా బాగుందని నిర్ధారించుకున్నాక మళ్లీ టేకాఫ్‌కు అనుమతిచ్చారు. విమానం దిల్లీ నుంచి బయలుదేరాక ఎమర్జెన్సీని సడలించి.. రాకపోకలను పునరుద్ధరించారు. దిల్లీ నుంచి పయనమైన ఈ విమానం అహ్మదాబాద్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా దిగినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని