Tej Pratap Yadav: లాలూ కుమారుడి లగేజి బయటపడేశారు.. తేజ్‌ప్రతాప్‌కు వారణాసిలో పరాభవం

మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ తనయుడు, బిహార్‌ మంత్రి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌కు ఘోర పరాభవం ఎదురైంది.

Updated : 09 Apr 2023 09:45 IST

వారణాసి: మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ తనయుడు, బిహార్‌ మంత్రి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. వారణాసిలోని ఓ హోటలులో బస చేసిన ఆయన బయటకు వెళ్లిన సమయంలో నిర్వాహకులు మంత్రి లగేజితోపాటు సెక్యూరిటీ సిబ్బంది బ్యాగులను బయటపడేశారు. శుక్రవారం రాత్రి హోటలుకు తిరిగివచ్చిన మంత్రి తమ లగేజి రిసెప్షను వద్ద ఉండటం చూసి కంగుతిన్నారు. మంత్రికి కేటాయించిన గదిని ఆయన గైర్హాజరీలో తెరిచి, వస్తువులను బయట పడేశారని తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ సంతోష్‌సింగ్‌ ఈ ఘటనపై మాట్లాడుతూ.. బిహార్‌ మంత్రి పేరిట ఏప్రిల్‌ 6వ తేదీ (గురువారం) ఒక్కరోజు మాత్రమే గదిని బుక్‌ చేసినట్లు హోటలు యాజమాన్యం చెప్పిందన్నారు. శుక్రవారం ఆ గదిని మరొకరికి కేటాయించడంతో బయటకు వెళ్లిన మంత్రి కోసం ఎదురుచూసి, చివరకు ఖాళీ చేసి లగేజిని రిసెప్షన్‌ వద్దకు చేర్చినట్లు తెలిపారని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని