EPFO - Higher Pension: అధిక పింఛనుపై ఈపీఎఫ్వో కీలక నిర్ణయం
ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే వేతనజీవులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు అధిక పింఛను అమలులో భాగంగా ఈపీఎఫ్వో కీలక నిర్ణయం తీసుకుంది.
అదనపు వేతనంపై 1.16 శాతం వాటా యజమాని చందా నుంచే సమీకరణ
అర్హత కలిగిన ఉద్యోగుల ఈపీఎస్ చందా 8.33 నుంచి 9.49 శాతానికి పెంపు
2014 సెప్టెంబరు 1 నుంచి అమలులోకి నిబంధన
కేంద్ర కార్మికశాఖ నోటిఫికేషన్ జారీ
ఈనాడు, హైదరాబాద్: ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే వేతనజీవులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు అధిక పింఛను అమలులో భాగంగా ఈపీఎఫ్వో కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులు, ఉద్యోగులు, పింఛనుదారులకు యాజమాన్యాలు చెల్లించిన 12 శాతం చందాలో నుంచే 1.16 శాతం మొత్తాన్ని ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)కు జమ చేసేలా ఈపీఎఫ్వో చట్టాన్ని సవరిస్తూ కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నిబంధన 2014 సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. బేసిక్, డీఏ, ఇతర భత్యాలు సహా వేతనం రూ.15,000 మించిన వారికి మాత్రమే ఈ నిబంధన వర్తించనుంది. అధిక పింఛనుకు అర్హత పొందని ఉద్యోగులకు, రూ.15 వేలు, అంతకన్నా తక్కువ వేతనం కలిగిన ఉద్యోగులకు మాత్రం యథావిధిగా ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారమే యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను నిధిలో, మిగతా 3.67 శాతం ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలో జమ అవుతుంది. పింఛను నిధి పథకానికి ఈపీఎఫ్వో 2014 సెప్టెంబరు 1న సవరణలు చేసింది. దీని ప్రకారం గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచింది.
అధిక పింఛను కోసం యజమానితో కలిసి ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు రూ.15 వేలకు మించి పొందుతున్న అదనపు వేతనంపై తమ చందా నుంచి 1.16 శాతం చొప్పున వాటా ఇవ్వాలని ఈపీఎఫ్వో షరతు పెట్టింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఉద్యోగుల వేతనం నుంచి అదనంగా తీసుకోవడం సామాజిక భద్రత నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. పింఛను నిధికి అదనపు చెల్లింపుల నిర్ణయాన్ని ఆరు నెలలపాటు నిలిపివేస్తున్నట్లు నిరుడు నవంబరులో ఉత్తర్వులిచ్చింది. నిధులను సమీకరించే ఇతర మార్గాలను పరిశీలించాలని సూచించింది. ఈ క్రమంలోనే ఉద్యోగి తన వంతుగా 1.16 శాతం చెల్లించాల్సిన అవసరం లేకుండా.. యజమాని జమ చేసే మొత్తం నుంచి దాన్ని ఈపీఎస్కు మళ్లించాలని ఈపీఎఫ్వో తాజాగా నిర్ణయం తీసుకుంది.
యజమాని చందా నుంచి సమీకరణ ఇలా..
* సాధారణంగా ఉద్యోగుల భవిష్య నిధికి యజమానుల వాటా కింద జమ అయ్యే 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్లోకి వెళ్తుంది. 3.67 శాతం ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది.
* ఈపీఎఫ్వో తాజా నిర్ణయంతో.. అధిక పింఛను దరఖాస్తు ఆమోదం పొందిన చందాదారులకు యజమాని చెల్లించే 12 శాతంలో నుంచే 1.16 శాతం మొత్తాన్ని సమీకరిస్తారు. దీంతో యజమాని నుంచి ఈపీఎస్ కింద వసూలు చేసే వాటా 9.49 శాతానికి పెరగనుంది. ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలోని వాటా 2.51 శాతానికి తగ్గుతుంది.
* ఉదాహరణకు అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగి వేతనం (మూల వేతనం, కరవు భత్యం కలిపి) రూ.50 వేలు ఉందనుకుందాం. గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలకు మించిన వేతనం రూ.35 వేలు. ఈపీఎస్ నిబంధనల ప్రకారం రూ.15 వేల వరకు 1.16%ం ఈపీఎస్కు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. మిగతా రూ.35 వేలపై 1.16% కింద ఉద్యోగి తన వంతు వాటా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఉద్యోగి తన చందా నుంచి ఈపీఎస్కు రూ.406 జమ చేయాలి.
* ప్రస్తుతం ఉద్యోగి వేతనంపై యజమాని వాటా 12% లెక్కన రూ.6 వేలు జమ చేస్తున్నారు. ఇందులో 8.33% (రూ.4,165) ఈపీఎస్కు, మిగతా 3.67% (రూ.1,835) ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు వెళ్తోంది.
* తాజా నిర్ణయం ప్రకారం యజమాని వాటాలోని కింద 9.49% కింద రూ.4,745 ఈపీఎస్కు వెళ్తుంది. మిగతా 2.51% కింద రూ.1,255 ఉద్యోగి భవిష్య నిధి ఖాతాలో జమ అవుతుంది. ఉద్యోగి తన వంతు వాటా 1.16% లెక్కన రూ.406 జమ చేయాల్సిన అవసరం ఉండదు.
అందుబాటులోకి డిలీట్ ఆప్షన్
అధిక పింఛను దరఖాస్తులు ఇప్పటికే యాజమాన్యాల లాగిన్లోకి వచ్చాయి. తాజాగా 1.16 శాతం మొత్తం జమపై ఈపీఎఫ్వో స్పష్టత ఇవ్వడంతో దరఖాస్తుల పరిష్కారం వేగమయ్యేందుకు అవకాశాలున్నాయి. ఉమ్మడి ఆప్షన్లు ఇచ్చినపుడు దొర్లిన పొరపాట్లను సరిచేసుకునేందుకు ‘డిలీట్ అప్లికేషన్’ ఆప్షన్ను అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం.. పొరపాట్లు దొర్లిన దరఖాస్తును డిలీట్ చేసి, సరైన వివరాలతో కొత్తగా ఆప్షన్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుకు యజమాని ఆమోదం తెలిపితే మాత్రం డిలీట్ చేసేందుకు అవకాశం ఉండదు. అయితే దరఖాస్తులను ఈపీఎఫ్వో అధికారులు పరిశీలించే సమయంలో తప్పులు సరిచేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వనున్నట్లు ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్(పెన్షన్స్) అప్రజిత జగ్గీ ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు