ఎన్నికైన ప్రభుత్వానికే పాలనాధికారం
దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆప్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంపై గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
దిల్లీ పాలనపై నియంత్రణ ఆప్ సర్కారుదే
అధికారులను బదిలీ చేసుకోవచ్చు
కొత్త నియామకాలూ చేపట్టొచ్చు
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు
కేంద్రం-దిల్లీ మధ్య వివాదానికి ముగింపు
దిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం
ఇక అవినీతి అధికారుల భరతం పడతానంటూ హెచ్చరిక
తీర్పును గౌరవిస్తున్నామన్న భాజపా
ఎన్నికైన ప్రభుత్వానికి పాలనపై నియంత్రణ ఉండాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ప్రభుత్వ విధానాల అమల్లో అధికారులతో కూడిన శాశ్వత కార్యనిర్వాహక వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తే.. అది ఓటర్ల అభీష్టాన్ని విస్మరించొచ్చు. జవాబుదారీతనం లేని అధికారులతో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం. కాబట్టి రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ ఉండాల్సిందే.
సుప్రీంకోర్టు
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆప్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంపై గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఐఏఎస్లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. జాబితా-2లోని మూడు అంశాల (భూములు, పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతలు)కే దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అధికారాలు పరిమితమని పేర్కొంది. ఈ మూడు మినహాయించి జాబితా-2, జాబితా-3లోని శాసన, కార్యనిర్వాహక అధికారాలన్నీ ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటాయని ప్రకటించింది. ఈ తీర్పుతో కేంద్రం-దిల్లీ సర్కారుకు మధ్య ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ పి.ఎస్.నరసింహల రాజ్యాంగ ధర్మాసనం ముగింపు పలికింది. 105 పేజీల ఏకగ్రీవ తీర్పులో ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సహకార సమాఖ్య స్ఫూర్తితో రాజ్యాంగం కల్పించిన సరిహద్దుల్లో మాత్రమే కేంద్రం తన అధికారాలను వినియోగించాలని పేర్కొంది. ‘‘ఎన్నికైన ప్రభుత్వానికి చెందిన మంత్రులకే అధికారులు జవాబుదారీగా ఉండాలి. ప్రతిగా శాసనసభలకు మంత్రులు, ప్రజలకు ప్రజాప్రతినిధులు జవాబుదారీగా వ్యవహరించాలి. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరే సార్వభౌమాధికారం ఉంటుంది. కాబట్టి జవాబుదారీతనం లేని పౌర సేవలు ప్రజాస్వామ్యంలో పాలనకు తీవ్ర హాని కలిగిస్తాయి. ప్రభుత్వ విధానాల అమల్లో ఎన్నికవ్వని పౌర సేవల అధికారులతో కూడిన శాశ్వత కార్యనిర్వాహక వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తే.. అది ఓటర్ల అభీష్టాన్ని విస్మరించే విధంగా కూడా వ్యవహరించొచ్చు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మంత్రి మండలి సలహాలకు ఎల్జీ కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.
వివాదం మొదలైందిలా..
దిల్లీలోని పాలనా సేవలపై కేంద్రానికే నియంత్రణ ఉంటుందంటూ 2015లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుతో ఈ వివాదం మొదలైంది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడా సానుకూల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సర్వోన్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం 2019 ఫిబ్రవరి 14న భిన్నాభిప్రాయ తీర్పును వెలువరించింది. పాలనా సేవలపై దిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని జస్టిస్ అశోక్ భూషణ్ చెప్పగా.. జస్టిస్ ఏకే సిక్రీ దాన్ని వ్యతిరేకించారు. దిల్లీలోని పాలనాధికారుల నియంత్రణకు సంబంధించిన శాసన, కార్యనిర్వాహక అధికారం కేంద్రానిదా, స్థానిక ప్రభుత్వానిదా అనే వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేస్తున్నట్లు గతేడాది మే 6న సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై గురువారం తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ అశోక్ భూషణ్ అభిప్రాయాన్ని తోసిపుచ్చింది.
ఇక అవినీతి అధికారుల భరతం పడతా
కేజ్రీవాల్
సుప్రీంకోర్టు తీర్పును.. ‘ప్రజాస్వామ్య విజయం’గా దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. ప్రజలకు న్యాయం లభించిందని అన్నారు. సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే అవినీతి అధికారుల భరతం పడతానని హెచ్చరించారు. ‘‘పరిపాలనాపరంగా రానున్న రోజుల్లో భారీగా మార్పులుంటాయి. ఇప్పటివరకు చేసిన పనులు ఆధారంగా చాలా మంది అధికారులను బదిలీ చేస్తాం. కొంత మంది ఏడాదిన్నరగా ప్రజాపనులకు ఆటంకం కలిగిస్తున్నారు. అలాంటి అధికారులు మూల్యం చెల్లించక తప్పదు. లంచం తీసుకుంటూ పట్టుబడినా ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి నాది. ఇప్పుడిక చర్యలు తప్పవు’’ అని కేజ్రీవాల్ తెలిపారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామని భాజపా తెలిపింది. ‘‘కేజ్రీవాల్ ఎప్పటి నుంచో తాను కోరుకుంటున్నది సాధించారు. భారీగా బదిలీలు ఉంటాయని చెబుతున్నారు. అంటే ఇక దేశ రాజధానికి పదవుల బదిలీ పరిశ్రమ కూడా రాబోతుంది’’ అని దిల్లీ భాజపా అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
తీర్పు ఇలా.. బదిలీ అలా..
సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఆప్ సర్కార్ కీలక అధికారిని బదిలీ చేసింది. దిల్లీ ప్రభుత్వంలోని సర్వీసెస్ విభాగం కార్యదర్శి ఆశిష్ మోరెను ఆ పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో దిల్లీ జల్ బోర్డు మాజీ సీఈవో ఎ.కె.సింగ్ను నియమించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న