మహిళల్నిచూసినా ఆగని బస్సు.. డ్రైవర్‌పై సస్పెన్షన్‌ వేటు

దేశ రాజధాని దిల్లీలోని ఓ బస్‌స్టాప్‌లో వేచిచూస్తోన్న మహిళల్ని ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన ఓ బస్సు డ్రైవర్‌ తీరుపై దిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

Updated : 19 May 2023 09:18 IST

 దిల్లీలో వెలుగు చూసిన ఘటన

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఓ బస్‌స్టాప్‌లో వేచిచూస్తోన్న మహిళల్ని ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన ఓ బస్సు డ్రైవర్‌ తీరుపై దిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అతడిని ఉద్యోగంలోంచి సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వీడియోలో రికార్డయిన దృశ్యాలను గమనిస్తే.. ముగ్గురు మహిళలు ఓ బస్‌ స్టాప్‌లో వేచి చూస్తున్నారు. బస్సులోని ఓ ప్రయాణికుడిని దించేందుకు బస్సును నెమ్మదిగా పోనిచ్చిన డ్రైవర్‌.. అక్కడ బస్సు వెనుక పరుగులు పెడుతున్న మహిళల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయినట్లు ఆ వీడియోలో రికార్డయింది. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆ డ్రైవర్‌ను గుర్తించి సస్పెండ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. కొందరు డ్రైవర్లు మహిళా ప్రయాణికుల కోసం బస్సు ఆపడంలేదని.. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని