TAX: రూ.2000 నోట్లతో రూ.4 లక్షల పన్ను చెల్లింపు
రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో కొందరు తమ దగ్గరున్న నోట్లను వదిలించుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు.
ఈటీవీ భారత్: రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో కొందరు తమ దగ్గరున్న నోట్లను వదిలించుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈ క్రమంలో గుజరాత్లోని సూరత్ జిల్లాకు చెందిన ఓ బస్సు యజమాని ఏకంగా తన వాహనంపై ఉన్న రూ.6 లక్షల పన్నులో రూ.4 లక్షలను రూ.2వేల నోట్లతో కట్టారు. కొంతకాలం క్రితం.. ఆర్టీఏ తనిఖీల సమయంలో రాజ్కోట్కు చెందిన బస్సుపై ఒక ఏడాదికి సంబంధించిన పన్ను బకాయి ఉందని అధికారులు గుర్తించారు. దీంతో బస్సును ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొచ్చి షెడ్లో ఉంచారు. మొత్తం పన్ను కట్టిన తర్వాతే బస్సును తిరిగి తీసుకెళ్లాలని తేల్చి చెప్పారు. అయినా యజమాని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల రూ.2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం వచ్చిన మరుసటి రోజే అతడు రూ.2వేల నోట్లతో పన్ను చెల్లించారు. మిగతా రెండు లక్షలను రూ.100, రూ.500 నోట్లతో చెల్లించారు.
పెరిగిన రైల్వే టికెట్ల అమ్మకాలు!
రూ.2వేల నోట్ల ప్రభావం సూరత్ రైల్వే స్టేషన్లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్లో స్పష్టంగా కనిపించింది. రోజూవారీ టికెట్ల అమ్మకాల కంటే ఇక్కడ రెట్టింపు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. సాధారణంగా రోజూ 2000 నుంచి 2500 వరకూ టిక్కెట్లు అమ్మే అధికారులు.. శనివారం ఏకంగా 5వేలకు పైగా రిజర్వేషన్ టికెట్లను విక్రయించారు. అదీ చాలామంది రూ.2000 నోట్లను ఇచ్చి టికెట్లను కొనుగోలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి