RBI - Shaktikanta Das: సెప్టెంబరు 30 తర్వాత రూ.2,000 నోట్లు చెల్లవని చెప్పలేదు
చలామణి నుంచి ఉపసంహరిస్తున్న రూ.2,000 నోట్లను బ్యాంకు శాఖల్లో ప్రజలు మార్చుకుని, వేరే నోట్లు తీసుకునేందుకు మంగళవారం నుంచీ అనుమతించనున్నారు.
ఆ తర్వాత ఏం చేయాలన్నది అప్పటి పరిస్థితి బట్టి నిర్ణయిస్తాం
నెలల సమయం ఉంది
కాబట్టి ఆలోపు మార్చుకోవాలని సూచిస్తున్నా
రూ.50,000కు మించి డిపాజిట్ చేస్తే పాన్ నంబరు ఇవ్వాల్సిందే
రూ.1,000 నోటు పునఃప్రవేశపెట్టే ప్రతిపాదనేదీ లేదు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ఈనాడు - దిల్లీ
చలామణి నుంచి ఉపసంహరిస్తున్న రూ.2,000 నోట్లను బ్యాంకు శాఖల్లో ప్రజలు మార్చుకుని, వేరే నోట్లు తీసుకునేందుకు మంగళవారం నుంచీ అనుమతించనున్నారు. ఇందుకోసం బ్యాంకుల వద్ద తగిన మేర నగదు అందుబాటులో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం ఇక్కడ వెల్లడించారు. ఈ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30 వరకు అవకాశం ఇచ్చినా, వాటి చెల్లుబాటు అప్పటివరకే పరిమితం అని తాము చెప్పడం లేదన్నారు. ఆలోపు మార్చుకోవడానికి అందరూ ప్రయత్నించాలని సూచించారు. నగదు నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే వీటిని ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రక్రియను అంతులేని కథలా వదిలిపెట్టకూడదన్న ఉద్దేశంతోనే సెప్టెంబరు 30వరకు గడువు విధించామని, ఆ తర్వాత ఏం చేయాలన్నది అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రూ.1000 నోటును పునఃప్రవేశపెట్టే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని స్పష్టంచేశారు.
నామమాత్ర ప్రభావమే
‘ప్రస్తుతం వ్యవస్థలో ఉన్న నగదులో రూ.2,000 నోట్ల వాటా 10.8 శాతమే. సాధారణ లావాదేవీల్లో ఈ నోట్ల వినియోగం అత్యంత తక్కువగా ఉంది. అందువల్ల మన ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావమేమీ ఉండద’ని ఆర్బీఐ గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. రూ.2,000 నోట్లు మార్చుకోవడానికి మంగళవారమే బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదని, 4 నెలల సమయం ఉన్నందున తీరిక ఉన్నప్పుడు వెళ్లి మార్చుకోవచ్చని చెప్పారు. సెప్టెంబరు 30కల్లా మార్కెట్లోని రూ.2,000 నోట్లన్నీ వెనక్కు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. రూ.2,000 నోట్ల చెల్లుబాటు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎంతోమంది విదేశాలకు వెళ్లి, కొన్ని నెలల పాటు ఉంటున్నారని, వారి ఇళ్లలో రూ.2,000 నోట్లు మిగిలి ఉంటే, గడువులోపు మార్చుకునేందుకు వారికి ఎదురయ్యే ఇబ్బందులను సున్నితత్వంతో పరిశీలిస్తామన్నారు. ఈ కసరత్తును ఇబ్బందుల్లేకుండా పూర్తిచేయాలన్నదే తమ లక్ష్యమని సోమవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు.
ప్రశ్న: ఇప్పుడు ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తే ఆర్బీఐ పరిశీలిస్తుందా?
జవాబు: ఆర్బీఐ ఎప్పుడూ ఈ పరిశీలన జరపదు. ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం లాంటివి సాధారణంగా పరిశీలన చేస్తుంటాయి.
ప్రశ్న: గతంలో పెద్దనోట్ల రద్దు ప్రతిపాదనను ప్రభుత్వమే చేసింది. ఇప్పుడీ రూ.2,000 నోటు ఉపసంహరణ ప్రతిపాదన కూడా ప్రభుత్వం నుంచే వచ్చిందా?
జవాబు: ఇవి అంతర్గత విషయాలు. వీటిపై ప్రజలకేమీ ఆసక్తి ఉండదు.
ప్రశ్న: రూ.2,000 నోట్లు చెల్లుతాయని చెబుతూనే, సెప్టెంబరు 30లోపు వాటిని మార్చుకోవాలని చెబుతున్నారు. దీనిపై స్పష్టత ఇస్తారా?
జవాబు: ప్రజలు రూ.2,000 నోట్లను మార్చుకోవాలనే అంశాన్ని సీరియస్గా తీసుకోవాలన్న ఉద్దేశంతోనే సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చాం. ఏ కసరత్తుకైనా నిర్దిష్ట గడువు లేకపోతే, దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. చిల్లర కష్టమవుతోందనే భావనతో చిన్న దుకాణాలవారు ఇదివరకటి నుంచీ రూ.2,000 నోటును స్వీకరించడం లేదు. ఈ విషయంలో నాకే వ్యక్తిగత అనుభవం ఉంది. అందువల్ల సెప్టెంబరు 30 కల్లా గరిష్ఠసంఖ్యలో నోట్లు వెనక్కు వస్తాయని అంచనావేస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది నేను ఊహాజనితంగా చెప్పలేను. రూ.2000 నోట్ల చెల్లుబాటు సెప్టెంబరు 30 వరకే అని మేం ఎక్కడా చెప్పలేదు.
ప్రశ్న: నోట్లు మార్చుకునేందుకు గుర్తింపుకార్డు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. అంటే నల్లధనం వెలికితీత ఉద్దేశం నెరవేరదు కదా?
జవాబు: బ్యాంకుల్లో నగదు లావాదేవీల నిర్వహణకు ఒక విధానం, మార్గదర్శకాలు ఉన్నాయి. అందువల్లే ఈ నోట్ల మార్పిడికీ అమల్లో ఉన్న నిబంధనలను అనుసరించాలని చెప్పాం కానీ, కొత్త నిబంధనలేమీ తీసుకురావడంలేదు. ఐటీ నిబంధనల ప్రకారం రూ.50,000కు మించి నగదు జమచేస్తే పాన్ కార్డ్ ఇవ్వాలి. ఇప్పుడూ ఆ నిబంధన వర్తిస్తుంది. ఒక విడతలో రూ.20,000 విలువ వరకే మార్చుకోవచ్చు కనుక ఏ ధ్రువీకరణ అవసరం లేదు. బ్యాంకులకు వచ్చేవారికి నీడ, నీటి సదుపాయాలు కల్పించమనీ సూచించాం.
ప్రశ్న: పెద్దనోట్లలోనే నకిలీల ముప్పు ఎక్కువన్న ఉద్దేశంతోనే ఉపసంహరిస్తున్నారా?
జవాబు: మోసగాళ్లు ఎప్పుడూ పెద్దనోట్లలో నకిలీలు తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. కానీ రూ.2,000, రూ.500 నోట్ల భద్రతా ప్రమాణాల్లోకి ఎవ్వరూ చొరబడలేదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నకిలీనోట్లు అత్యాధునిక ఫొటోకాపీల ద్వారా చేసినవే. నోట్ల సెక్యూరిటీ ఫీచర్లను దెబ్బతీసి, నకిలీనోట్లను ప్రవేశపెట్టడానికి ఇదివరకు విదేశాల్లో ప్రయత్నించిన సందర్భాలున్నాయి. వీటిలో సాధ్యం కాలేదు. మేం క్లీన్నోట్ పాలసీతోనే రూ.2వేల నోట్లను ఉపసంహరిస్తున్నాం మినహా, నకిలీల బెడద వల్ల కాదు.
ప్రశ్న: తరచు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, నగదు నిర్వహణపై ప్రజలకు అనుమానాలు రావా?
జవాబు: మన నగదు నిర్వహణ విధానం చాలా పటిష్ఠంగా ఉంది. డాలర్తో పోల్చినప్పుడు.. ఇతర కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి మారకపు విలువలో హెచ్చుతగ్గులు చాలా తక్కువగా ఉన్నాయి. కొత్త మహాత్మాగాంధీ సిరీస్ నోట్ల సెక్యూరిటీ ఫీచర్లు దెబ్బతినలేదు. మన కరెన్సీకున్న భద్రత కొనసాగుతుంది.
ప్రశ్న: కొత్తగా రూ.1,000, లేదా మరే నోట్లను అయినా ప్రవేశపెడతారా?
జవాబు: అది పూర్తి ఊహాజనిత ప్రశ్న. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేదీ లేదు. వ్యవస్థలో ద్రవ్యలభ్యతను ఆర్బీఐ నిరంతరం పర్యవేక్షిస్తుంది. దానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాం. గతవారమే రూ.46,400 కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశపెట్టాం.
ప్రశ్న: వ్యవస్థలో 10% నోట్లను ఇప్పుడు ఉపసంహరిస్తున్నారు. దాన్ని భర్తీచేయడానికి కొత్తగా రూ.500, ఇతర నోట్లు ఎంతమేరకు
ముద్రించాల్సి ఉంటుంది?
జవాబు: ఇప్పటికే మన దగ్గర అవసరమైన దానికంటే ఎక్కువ నోట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం ఆర్బీఐ దగ్గరే కాకుండా బ్యాంకుల కరెన్సీ నిల్వ కేంద్రాల్లో ఉన్నాయి. అందువల్ల ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ప్రశ్న: ఒక్కోసారి మార్చుకోవడానికి గరిష్ఠంగా రూ.20 వేల వరకే ఎందుకు పరిమితి విధించారు.
జవాబు: 2005 నుంచి అమల్లో నోట్లను 2013-14లో ఉపసంహరించి, వాటి మార్పిడికి అవకాశం ఇచ్చాం. గరిష్ఠంగా అప్పుడూ ఒక్కోసారి 10 నోట్లు మార్చుకోవడానికే వీలు కల్పించాం. ఇప్పుడూ అదే పరిమితి కొనసాగించాం.
ప్రశ్న: రూ.2000 నోట్లను స్థిరాస్తి, బంగారం కొనుగోళ్లకు వాడతారని భావిస్తున్నారా?
జవాబు: వాటి కొనుగోళ్ల గురించి నేనేమీ చెప్పలేను. అది ప్రజలపై ఆధారపడి ఉంటుంది. దేశంలోని వివిధ చోట్ల అనధికారికంగా నిర్వహించిన సర్వేల్లోనూ ‘సాధారణ లావాదేవీల్లో రూ.2,000 నోట్లు ఎక్కడా కనిపించడం లేద’ని తేలింది. అందువల్ల ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడదు.
ప్రశ్న: ఇప్పటికీ రూ.2,000 నోటుతో సాధారణ వస్తువులు కొనుగోలు చేయొచ్చా? లేదా?
జవాబు: రూ.2,000 నోటు చెల్లుబాటవుతుంది. ఆ విషయం నోటిఫికేషన్లోనూ చెప్పాం. అయితే చిల్లర లేని కారణంగా ఎవరైనా తీసుకోకపోతే దాని గురించి ఏమీ వ్యాఖ్యానించలేం. అది ఆచరణలో వచ్చే సమస్య.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..