దాచినవన్నీ బయటికొస్తున్నాయ్!
రూ.2వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించగానే ఇప్పటిదాకా కనిపించని ఆ నోట్లు ఇప్పుడు మార్కెట్లో రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతున్నాయి.
ఏది కొనాలన్నా రూ.2 వేల నోటే
మామిడిపండ్లు, వాచీలకూ అదే కరెన్సీ
ముంబయి, దిల్లీ: రూ.2వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించగానే ఇప్పటిదాకా కనిపించని ఆ నోట్లు ఇప్పుడు మార్కెట్లో రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతున్నాయి. వాటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ చెప్పినా ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. మార్కెట్లో కొనుగోళ్లకే జనం అధికంగా వినియోగిస్తున్నారు. మామిడి కాయల నుంచి ఖరీదైన వాచ్లదాకా కొనేస్తున్నారు. దీంతో నగదు కొనుగోళ్లు భారీగా పెరిగాయి. అమ్మకాలు పెరుగుతున్నాయనే సంతోషంతో దుకాణదారులూ రూ.2వేల నోట్లను విరివిగా తీసుకుంటున్నారు. ముంబయిలోని క్రాఫర్డ్ మార్కెట్లో మామిడి కాయలను కొన్న వినియోగదారులు ఎక్కువగా రూ.2వేల నోట్లనే ఇస్తున్నారని ఓ వ్యాపారి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 8 నుంచి 10 నోట్లు తనకు వస్తున్నాయని, వాటిని బ్యాంకులో తర్వాత మార్చుకుంటానని చెప్పారు. ముంబయిలోని ఓ మాల్లో ఉన్న రాడో వాచ్ స్టోర్లో రూ.2వేల నోట్ల తాకిడి 60శాతం నుంచి 70శాతం పెరిగిందని మేనేజరు వెల్లడించారు. గతంలో ఒకటి రెండు అమ్మేవాళ్లమని, ప్రస్తుతం మూడు నాలుగు అమ్ముతున్నామని తెలిపారు. క్యాష్ ఆన్ డెలివరీలో తమకు 72శాతం రూ.2వేల నోట్లే వస్తున్నాయని జొమోటో ఫుడ్ డెలివరీ యాప్ యాజమాన్యం పేర్కొంది. అయితే కొంత మంది వ్యాపారులు రూ.2వేల నోట్లను అంగీకరించడం లేదు. తరువాత ఇబ్బందుల్లో పడలేమని వారంటున్నారు.
పెట్రోలును వెనక్కి తీసుకున్న బంకు సిబ్బంది
లఖ్నవూ: పెట్రోలు పోయించుకుని రూ.2వేల నోటు ఇచ్చిన వినియోగదారుడికి షాకిచ్చింది ఉత్తర్ప్రదేశ్లోని ఓ బంకు. పోసిన పెట్రోలును సిబ్బంది వెనక్కి తీసుకున్నారు. జలౌన్లోని ఓ పెట్రోలు బంకుకు వినియోగదారుడు వచ్చి పెట్రోలు పోయించుకున్నారు. ఆ తర్వాత 2వేల నోటును ఇవ్వబోతే సిబ్బంది తిరస్కరించి చిన్న నోట్లు ఇవ్వాలని కోరారు. తనవద్ద లేవని చెప్పడంతో వాహనంలో పోసిన పెట్రోలును పైపుద్వారా వెనక్కి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మేనేజరు మాత్రం తమ చర్యను సమర్థించుకున్నారు. ‘రూ.50 పెట్రోలుకూ వినియోగదారులు రూ.2వేల నోటు ఇస్తున్నారు. గతంలో మూడు నుంచి నాలుగు నోట్లే వచ్చేవి. ఇప్పుడు 70దాకా వస్తున్నాయి’ అని పేర్కొన్నారు.
పెద్ద నోట్ల రద్దు కాదు: ఆర్బీఐ
రూ.2వేల నోట్ల ఉపసంహరణను పెద్ద నోట్ల రద్దుగా పరిగణించకూడదని, అవి చట్టబద్ధ కరెన్సీగానే చలామణి అవుతాయని, బ్యాంకుల దైనందిన కార్యకలాపాలకు ఇబ్బంది కలగని రీతిలో తక్కువ విలువ గల కరెన్సీ నోట్లలోకి మార్చుకునే సౌలభ్యం కల్పించామని దిల్లీ హైకోర్టుకు ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ఆర్బీఐ సమాధానమిచ్చింది. వాదనలను విన్న హైకోర్టు తరువాత సముచిత నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది.
బ్యాంకుల వద్ద రద్దీ లేదు
రూ.2వేల నోట్ల మార్పిడి తొలిరోజైన మంగళవారం బ్యాంకులవద్ద హడావుడేమీ కనిపించలేదు. ఎలాంటి డాక్యుమెంట్లను అడగబోమని ప్రకటించిన ఎస్బీఐవద్దే కొంత రద్దీ కనిపించింది. అదే 2016 నోట్ల రద్దు సమయంలో భారీ క్యూలు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల ఆందోళనలూ జరిగాయి. కొన్ని బ్యాంకులవద్ద ధ్రువపత్రాలేమైనా సమర్పించాలా అన్న అంశంపై క్లారిటీ లేకపోవడంతో అయెమయం నెలకొంది. ఐడీలు సమర్పించక్కర్లేదని ఆర్బీఐ చెప్పినా కొంత మంది బ్యాంకర్లు అడిగినట్లు సమాచారం. కొంత మంది ఎలక్ట్రానిక్ ఎంట్రీ ద్వారా రూ.2వేల నోట్లను మార్చారు. మరికొంత మంది పేరు, ఫోన్ నంబరు అడిగి తీసుకున్నారు. కొంత మంది బ్యాంకర్లు ఖాతాల్లో జమచేయాలని సూచించారు. రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల వద్దా పెద్దగా రద్దీ కనిపించలేదు. వేసవి కావడంతో ఆ కార్యాలయాలవద్ద మంచినీటి వంటి ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..