Lottery: అజ్ఞాత వ్యక్తికి రూ.12 కోట్ల లాటరీ

కేరళలో ఓ వ్యక్తికి రూ.12 కోట్ల లాటరీ తగిలింది. విషు బంపర్‌ లాటరీ పేరుతో తిరువనంతపురం జిల్లాలో ఈ టికెట్లను కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్‌ అమ్మింది.

Updated : 25 May 2023 09:26 IST

కేరళలో ఓ వ్యక్తికి రూ.12 కోట్ల లాటరీ తగిలింది. విషు బంపర్‌ లాటరీ పేరుతో తిరువనంతపురం జిల్లాలో ఈ టికెట్లను కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్‌ అమ్మింది. బుధవారం మధ్యాహ్నం  విషు బంపర్‌ లాటరీ డ్రా జరిగింది. మలప్పురం జిల్లా తిరూర్‌లోని ఎం 5087 ఏజెన్సీకి చెందిన ఆదర్శ్‌ అనే వ్యక్తి.. ఈ రూ.12 కోట్ల విన్నింగ్‌ టికెట్‌ను విక్రయించాడు. విజేత లాటరీ టికెట్‌ నంబరు వీఈ 475588. దీన్ని కొన్నది ఎవరన్నది ఇంకా తెలియలేదు. 10% ఏజెన్సీ కమీషన్‌, 30% ఇతర పన్నులు మినహాయించకుని మిగిలిన మొత్తం రూ.7.20 కోట్లు అతడు అందుకోనున్నాడు. ఇదే డ్రాలో.. మరో ఆరుగురికి రెండో బహుమతి లభించింది. వీరికి ఒకొక్కరికి కోటి రూపాయల చొప్పున అందజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని