ఏళ్లతరబడి పాలించినా వారసత్వ రాజకీయాలను వదల్లేదు
దేశాన్ని ఏళ్లతరబడి పాలించిన పార్టీలు హైస్పీడ్ రైళ్ల కోసం ఎన్నో గొప్పలు చెప్పినా.. సమయం గడిచిపోవడమే తప్పిస్తే చివరకు ఏమీ సాధించలేకపోయాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు.
అందుకే ఆధునిక రైళ్లు ఆలస్యమయ్యాయి
కాంగ్రెస్పై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు
దేహ్రాదూన్: దేశాన్ని ఏళ్లతరబడి పాలించిన పార్టీలు హైస్పీడ్ రైళ్ల కోసం ఎన్నో గొప్పలు చెప్పినా.. సమయం గడిచిపోవడమే తప్పిస్తే చివరకు ఏమీ సాధించలేకపోయాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. దిల్లీలోని ఆనంద్విహార్ టెర్మినల్ స్టేషన్ నుంచి దేహ్రాదూన్కు నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ను గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఇది ఉత్తరాఖండ్కు తొలి వందేభారత్ రైలు. ‘‘దీర్ఘకాలం దేశాన్ని పాలించిన పార్టీలు వంశపారంపర్య రాజకీయాల నుంచి బయటపడలేకపోయాయి. అవినీతి, కుంభకోణాలకు పాల్పడడంపైనే వాటి దృష్టి ఉండేది. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆ పార్టీలు దృష్టి సారించినట్లయితే 21వ శతాబ్దంలో దేశం మరెంతో వేగంగా ముందుకు దూసుకువెళ్లి ఉండేది’’ అని చెప్పారు. అభివృద్ధి చేయాలనే నియత్ (ఉద్దేశం), నీతి (విధానం), నిష్ఠ (అంకితభావం) ఉన్న ప్రభుత్వం తొలిసారిగా ఏర్పడిందని తెలిపారు. ‘ప్రపంచమంతా మనదేశం వైపు ఎంతో ఆశాభావంతో చూస్తోంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్న తీరు, పేదరికంపై పోరాటం, కరోనా సవాల్ను ఎదుర్కొన్న విధానాన్ని చూశాక ప్రపంచానికి నమ్మకం పెరిగింది. ఇతర దేశాలవారు ఇక్కడకు వచ్చి దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు’ అని మోదీ చెప్పారు. రైలు, రోడ్డు, తీగ మార్గాల అభివృద్ధి పనులతో ఉత్తరాఖండ్కు మహర్దశ పట్టనుందని, చార్ధామ్ యాత్రికుల కోసం సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని వివరించారు.
ఫిబ్రవరి-మార్చి నాటికి మూడు రకాల వందేభారత్లు: వైష్ణవ్
వందేభారత్ రైళ్లలో మూడు రకాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 100 కి.మీ. లోపు దూరాలకు వందే మెట్రో, 100-550 కి.మీ. ప్రయాణానికి వందే ఛైర్కార్, అంతకుమించిన ప్రయాణానికి వందే స్లీపర్ రైళ్లను ప్రవేశపెడతామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. రాబోయే 3-4 ఏళ్లలో వందేభారత్ రైళ్లు గంటకు 160 కి.మీ. గరిష్ఠ వేగంతో ప్రయాణించేలా రైలు పట్టాలను ఉన్నతీకరిస్తామని చెప్పారు. ఈ జూన్ మధ్య నాటికి ప్రతి రాష్ట్రానికీ వందేభారత్లు అందుబాటులోకి వస్తాయన్నారు. దీనికి తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచామనీ, ప్రతి 8-9 రోజులకు ఒకటి చొప్పున ఈ రైళ్లు తయారవుతున్నాయని వైష్ణవ్ తెలిపారు. మరో రెండు కర్మాగారాల్లోనూ వీటి ఉత్పత్తి ప్రారంభం కానుందని చెప్పారు. రైళ్లలో ప్రయాణించేవారికి 4జి, 5జి సేవలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..