సంక్షిప్త వార్తలు(8)
ఈ ఏడాది వేసవి పంటల సాగు విస్తీర్ణం ఇప్పటివరకూ 1.69 లక్షల హెక్టార్లు తగ్గింది.
తగ్గిన వేసవి పంటల సాగు విస్తీర్ణం
ఈనాడు, దిల్లీ ఈ ఏడాది వేసవి పంటల సాగు విస్తీర్ణం ఇప్పటివరకూ 1.69 లక్షల హెక్టార్లు తగ్గింది. గత ఏడాది ఇదే సమయానికి మొత్తం 71.99 లక్షల హెక్టార్లలో పంటలు సాగుకాగా, ఈసారి అది 70.30 లక్షల హెక్టార్లకు తగ్గినట్లు శుక్రవారం కేంద్ర వ్యవసాయశాఖ చేసిన ప్రకటన ద్వారా వెల్లడైంది. ఇది క్రితం ఏడాదికంటే 2.34% తక్కువ. గత ఏడాదితో పోలిస్తే వరి, నూనెగింజల సాగు తగ్గగా, పప్పుదినుసులు, తృణధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగింది.
విపక్షాల బహిష్కరణను ఖండించిన మాజీ అధికారులు
దిల్లీ: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించడంపై మాజీ అధికారులు, రాయబారులు, పలు రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులతో కూడిన 270 మంది ప్రముఖులు ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. భారతీయులందరూ గర్వించాల్సిన క్షణాల్లో.. అపరిపక్వ, హేతుబద్ధత లేని కారణాలతో ఓ గొప్ప కార్యక్రమానికి దూరంగా ఉండాలన్న విపక్షాల నిర్ణయాన్ని తప్పుపట్టారు. మోదీ ప్రభుత్వం భారత్ ప్రథమం అని ముందుకు వెళుతుంటే.. ప్రతిపక్షాలు కుటుంబమే ముందన్న విధానంతో నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రకటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మాజీ డైరెక్టర్ వైసీ మోదీ, మాజీ ఐఏఎస్ అధికారులు ఆర్.డి.కపూర్, గోపాలకృష్ణ, సమరీంధ్ర ఛటర్జీ, లింగాయ యూనివర్సిటీ ఉపకులపతి అనిల్ రాయ్ దూబే తదితరులు సంతకం చేశారు.
నైరుతిలో సాధారణ వర్షపాతమే: ఐఎండీ
దిల్లీ: సాధారణం కంటే జూన్ మాసంలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దక్షిణ కర్ణాటక, ఉత్తర తమిళనాడు, రాజస్థాన్, లద్దాఖ్లు మినహా మిగిలిన చాలా ప్రాంతాల్లో జూన్ మాసంలో సాధరణం కంటే తక్కువగానే వర్షాలు కురుస్తాయని ఐఎండీ పర్యావరణ పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం అధిపతి డి.శివానంద పాయి తెలిపారు. అయితే నైరుతి రుతుపవనాల కారణంగా ఈ సీజన్ మొత్తం మీద సాధారణ స్థాయిలోనే వర్షపాతం నమోదవుతుందని ఆయన వెల్లడించారు. సహజంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలోకి ప్రవేశించే విషయం తెలిసిందే. ఈసారి నాలుగు రోజులు ఆలస్యంగా రానున్నాయి.
అభిషేక్ బెనర్జీకి జరిమానా విధింపుపై సుప్రీం స్టే
దిల్లీ: పాఠశాలల్లో ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి రూ.25 లక్షల జరిమానా విధిస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఎంపీ లేవనెత్తిన అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నప్పటికీ రూ.25 లక్షల విధింపు పూచీగా భావించలేమోనన్న అభిప్రాయాన్ని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
శ్రీకృష్ణ జన్మభూమి-షాహి ఈద్గా కేసులన్నీ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ
ప్రయాగ్రాజ్: మథుర కోర్టులో పెండింగ్లో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి-షాహి ఈద్గా వివాదానికి సంబంధించిన కేసులన్నీ తనకు బదిలీ చేయాలని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. రంజనా అగ్నిహోత్రి, మరో ఏడుగురు దాఖలుచేసిన పిటిషన్పై జస్టిస్ అరవింద్ కుమార్ మిశ్ర ఈ ఉత్తర్వులిచ్చారు. ఈ వివాదంతో ముడిపడిన కేసుల జాబితాను రూపొందించడంతో పాటు సంబంధిత రికార్డులను రెండు వారాల్లోగా హైకోర్టుకు పంపించాలని మథుర జిల్లా జడ్జికి సూచించారు. విచారణ కోసం ఈ వ్యాజ్యాలను ఏదైనా ధర్మాసనానికి కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ అరవింద్ కుమార్ శర్మ విజ్ఞప్తి చేశారు.
సాంకేతిక సమస్యతో దిల్లీకితిరిగొచ్చిన విమానం
దిల్లీ: కెనడాలోని వాంకోవర్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం సాంకేతిక సమస్యతో శుక్రవారం దిల్లీకి తిరిగొచ్చింది. బోయింగ్ 777 విమానం దిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక సమస్యను పైలెట్లు గుర్తించారు. దానిని సురక్షితంగా దిల్లీ విమానాశ్రయానికి వెనక్కి తెచ్చారని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. అందులోని 298 మంది ప్రయాణికుల్ని మరో విమానంలో వాంకోవర్కు పంపారు.
రూ.1500 కోట్ల విలువైన మత్తు పదార్థాల ధ్వంసం
ముంబయి: కస్టమ్స్ విభాగం దాడుల్లో దొరికిన 350 కిలోల మత్తు పదార్థాలను అధికారులు శుక్రవారం ముంబయిలో ధ్వంసం చేశారు. ఈ మాదక ద్రవ్యాల విలువ నల్లబజారులో రూ.1500 కోట్ల వరకూ ఉంటుందని వెల్లడించారు. నవీ ముంబయిలోని చెత్త నిర్వహణ కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలన కమిటీ సమక్షంలో వీటిని సురక్షితమైన పద్ధతుల్లో తగులబెట్టారు. 2022 అక్టోబరులో ఫ్రూట్ కన్సైన్మెంట్లో అక్రమంగా రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్న 9 కిలోల కొకైన్, 198 కిలోల మెథాంఫెటామైన్ కూడా వీటిలో ఉన్నాయి. 33 కిలోల గంజాయి, 82 కిలోల మాడ్రాక్స్తో పాటు 298 ఎండీఎంఏ ట్యాబ్లెట్లనూ ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
సరికొత్త ఆండ్రాయిడ్ వైరస్.. జాతీయ సైబర్ భద్రతా సంస్థ హెచ్చరిక
దిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ప్రవేశించి ఫోన్ నంబర్లను, కాల్ రికార్డులను, కెమెరాలను హ్యాక్ చేస్తున్న ‘దామ్’ అనే మాల్వేర్ దేశంలో వేగంగా వ్యాపిస్తోందని జాతీయ సైబర్ భద్రతా సంస్థ ‘సెర్టిన్’ హెచ్చరించింది. దామ్ను ఆండ్రాయిడ్ బాట్ నెట్గా వర్ణించింది. మొబైల్ ఫోన్లలోని యాంటీ వైరస్ ప్రోగ్రామ్లను తప్పించుకుని ర్యాన్సమ్వేర్ను చొప్పించే సత్తా దీనికి ఉంది. థర్డ్ పార్టీ వెబ్సైట్లు, నమ్మదగని, అజ్ఞాత సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకునే అప్లికేషన్ల ద్వారా ఈ మాల్వేర్ వేగంగా వ్యాపిస్తోంది. ఇలాంటి వైరస్లు, మాల్వేర్ల నుంచి రక్షణకు సెర్టిన్ కొన్ని సూచనలు చేసింది. నమ్మదగ్గని వెబ్సైట్లను బ్రౌజ్ చేయవద్దనీ, అలాంటి లింకులపై క్లిక్ చేయవద్దనీ కోరింది. అడగకుండా వచ్చే ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్లను తెరవద్దనీ, ఎప్పటికప్పుడు యాంటీ వైరస్, యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవాలని సలహా ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే