Parliament: 96 ఏళ్ల పాత పార్లమెంటుకిక వీడ్కోలు
అనేకానేక చారిత్రక ఘట్టాలకు, మహామహులకు, ఆధునిక భారత ప్రస్థానానికీ...ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది 96 ఏళ్ల పాత పార్లమెంటు భవనం!
ఆధునిక భారత ప్రస్థానానికి ప్రత్యక్షసాక్షి
ఎన్నెన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక
స్వాతంత్య్రానికి పూర్వం...
‘‘ఇంక్విలాబ్ జిందాబాద్... అంటూ భగత్సింగ్, బటుకేశ్వర్దత్లు బాంబు విసురుతూ చేసిన విప్లవ నాదానికి...
స్వాతంత్య్రోదయాన...
విధిలిఖిత వేళ... (ట్రిస్ట్ విత్ డెస్టినీ) అంటూ... జవహర్లాల్ నెహ్రూ భావోద్వేగంతో రాల్చిన ఆనందబాష్పాలకు...
స్వాతంత్య్రానంతరం...
అనేకానేక చారిత్రక ఘట్టాలకు, మహామహులకు, ఆధునిక భారత ప్రస్థానానికీ...ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది 96 ఏళ్ల పాత పార్లమెంటు భవనం!
1911లో కోల్కతా నుంచి రాజధానిని దిల్లీకి తరలించాలని నిర్ణయించిన బ్రిటిష్ ప్రభుత్వం ఇందుకోసం కొత్త దిల్లీని ప్రత్యేకంగా నిర్మించింది. 1913లోనే కొత్త దిల్లీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ సమయానికి పార్లమెంటులాంటి ఆలోచనే ఆంగ్లేయులకు లేదు. గవర్నర్ జనరల్ నివాసం (ప్రస్తుత రాష్ట్రపతి భవనం)లోనే లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేస్తే సరిపోతుందని అనుకున్నారు. ఎందుకంటే కౌన్సిల్ చాలా చిన్నది. వేసవిలోనైతే శిమ్లాలోని వైస్రాయ్ లాడ్జ్లో సమావేశం నిర్వహించేవారు. చలికాలంలో దిల్లీలోని ప్రభుత్వ సెక్రటేరియెట్ భవంతిలో (ప్రస్తుత దిల్లీ అసెంబ్లీ) భేటీ అయ్యేవారు. అందుకే పార్లమెంటుకు ప్రత్యేక భవంతి అనే ప్రస్తావన రాలేదు. కానీ... 1918 మాంటెగు చెమ్స్ఫర్డ్ సంస్కరణలతో చట్టసభల ప్రాధాన్యంతో పాటు... సంఖ్యా పెరిగింది. ఎగువ, దిగువ సభలు అమల్లోకి వచ్చాయి. వీటి నిర్వహణతో పాటు సభ్యులు, పరిపాలన సిబ్బంది పెరిగారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం రెండు ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ఒకటి- షామియానా (టెంట్)లో సభను నిర్వహించటం. రెండోది- భవంతిని నిర్మించటం. షామియానా కింద నిర్వహిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో రెండో ప్రతిపాదనకే మొగ్గు చూపి... 1921లో సెక్రటేరియెట్ బిల్డింగ్లోనే ఓ భారీ ఛాంబర్ కట్టారు. అదే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ) తొలి భవంతి.
ఆరెకరాల్లో.. 144 పిల్లర్లతో..
ఇంతలో కొత్తదిల్లీ రూపశిల్పులైన బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ ల్యూటెన్, హెర్బర్ట్ బేకర్లు ఎగువ, దిగువ చట్టసభలకు శాశ్వత భవన నిర్మాణాలను ప్రతిపాదించారు. ల్యూటన్ వృత్తాకారంలో, బేకర్ త్రికోణాకారంలో ప్రణాళికలు తయారు చేశారు. చివరకు ల్యూటన్ దానికే బ్రిటిష్ సర్కారు మొగ్గు చూపింది. 1921 ఫిబ్రవరి 12న డ్యూక్ ఆఫ్ కానాట్ ప్రిన్స్ ఆర్థర్ కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలో తయారైన ఈ భవనాన్ని 1927 జనవరి 19న అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో 144 పిల్లర్లతో (ఒక్కోటి 27 అడుగుల ఎత్తు) తయారైన ఈ అందమైన భవంతి మధ్యలో సెంట్రల్ హాల్, దాని పక్కనే మూడు అర్ధవృత్తాకార ఛాంబర్లు... చుట్టూ ఉద్యానవనంతో ఆకట్టుకునేలా నిర్మించారు. ఈ భవంతి ఆకృతికి¨ మధ్యప్రదేశ్లోని చౌసత్ యోగిని దేవాలయాకృతి స్ఫూర్తి అంటారు. ఆకాలంలో ఈ పార్లమెంటు భవనం దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది.
స్వతంత్ర భారతంలోని అత్యంత కీలక చట్టాలకు, ఎమర్జెన్సీలాంటి చీకటి ఘట్టాలకు, ఆధునిక భారత ప్రస్థానానికి దారితీసిన సంస్కరణలకు... అద్దంలా నిల్చిన ఈ ప్రజాస్వామ్య సౌధం 96వ ఏట విశ్రాంతి తీసుకోబోతోంది! తెలుగు పాటలో చెప్పాలంటే... నిశాంత ప్రశాంత ఏకాంత సౌధంలా
నిదురించు జహాపనా!
ఇక్కడే అధికార మార్పిడి
సెంట్రల్ హాల్ చుట్టూ ఉండే ఒక ఛాంబర్లో సంస్థానాధీశుల సభ (ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్), మరోదాంట్లో స్టేట్ కౌన్సిల్ (ఎగువ సభ, ప్రస్తుత రాజ్యసభ), మూడోదాంట్లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ, ప్రస్తుత లోక్సభ) ఉండేవి. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే 1929లో విప్లవకారుడు భగత్సింగ్, ఆయన సహచరుడు బతుకేశ్వర్ దత్లు బాంబు విసిరి సంచలనం సృష్టించారు. స్వాతంత్య్రానంతరం బ్రిటిష్ నుంచి అధికార మార్పిడి ఈ పార్లమెంటు భవనంలోనే జరిగింది. అంతేకాదు... కొత్త ఏర్పాట్లు జరిగేదాకా మొదట్లో సుప్రీంకోర్టు కూడా ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. యూపీఎస్సీ కార్యాలయం కూడా పార్లమెంటులోనే ఉండేది. స్థలాభావాన్ని అధిగమించటం కోసం 1956లో పాత పార్లమెంటులో మరో రెండు అంతస్థులు నిర్మించారు. అయినా స్థలం సరిపోక అవస్థలు పడేవారు. లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమారైతే... ఈ భవనం కన్నీరుకారుస్తోందని వాపోయేవారు. 2001లో పాకిస్థాన్ దన్నుతో లష్కరే తోయిబా తీవ్రవాదుల దాడినీ ఎదుర్కొందీ భవంతి.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM