సంక్షిప్త వార్తలు (5)
స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్దంతి సందర్భంగా శనివారం పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఆధునిక భారత రూపశిల్పి నెహ్రూ
దేశ తొలి ప్రధానికి నేతల ఘన నివాళులు
దిల్లీ: స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్దంతి సందర్భంగా శనివారం పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు దిల్లీలోని శాంతివనంలో ఉన్న నెహ్రూ సమాధిని సందర్శించి దివంగత నేతలకు పుష్పాంజలి ఘటించారు.ఆధునిక భారత రూపశిల్పి పండిట్ నెహ్రూ అంటూ ప్రియాంకా గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు కొనియాడారు. ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా పండిట్ నెహ్రూకు నివాళులర్పించారు.
బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలి: రాందేవ్
జైపుర్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని యోగా గురువు రాందేవ్ బాబా డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలంటూ కొంతకాలంగా దిల్లీలో నిరసన కొనసాగిస్తున్న మహిళా కుస్తీ యోధులకు శనివారం ఆయన మద్దతు తెలిపారు. ‘‘బ్రిజ్ భూషణ్పై వచ్చిన ఆరోపణలు అవమానకరమైనవి. లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేసి.. జైల్లో పెట్టాలి. ఆ వ్యక్తి మహిళల గురించి చెత్తగా మాట్లాడుతున్నాడు. అతని వైఖరి ఖండించదగినది’’ అని రాందేవ్ బాబా పేర్కొన్నారు. యోగా శిబిరంలో పాల్గొనేందుకు రాజస్థాన్లోని భిల్వారా వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో చేరబోనని చెప్పారు. ప్రధాని మోదీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్లను ప్రశంసించారు. తనకు ఎవరితోనూ శత్రుత్వంలేదని రాందేవ్ బాబా స్పష్టం చేశారు.
ఉత్తర భారతంలో భారీ వర్షాలు
2 రోజుల్లో 26 మంది మృతి
దిల్లీ: ఉత్తర, ఈశాన్య భారతాల్లో భారీ వర్షాలు పడటంతోపాటు తీవ్ర గాలులు వీస్తున్నాయి. గాలి వానకుతోడు పిడుగులు పడటం, చెట్టు విరిగిపడటంతో పలువురు చనిపోయారు. గత రెండు రోజుల్లో రాజస్థాన్లో గాలి వాన బీభత్సంతో 13 మంది చనిపోయారు. ఝార్ఖండ్లో పిడుగులు పడి 12 మంది మరణించారు. ఉత్తర్ ప్రదేశ్లో ఒకరు మృతి చెందారు. దిల్లీలోనూ భారీగా వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడింది. అయితే నగరంలో రోడ్లు జలమయమై ట్రాఫిక్కు కొన్నిచోట్ల అంతరాయం కలిగింది. తీవ్ర గాలులకు చెట్లూ విరిగిపడ్డాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపడటంతో కొన్నిచోట్ల విద్యుత్తుకు అంతరాయం కలిగింది. ఆదివారమూ మరిన్ని వర్షాలు పడతాయని, గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
జీఎస్టీ పరిహారంపై శాశ్వత యంత్రాంగం ఉండాలి
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బఘేల్ డిమాండ్
దిల్లీ: జీఎస్టీ వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లింపుపై శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ డిమాండు చేశారు. దీంతోపాటు కొత్త పింఛను పథకంలో డిపాజిట్ చేసిన రూ.19వేల కోట్లను వెనక్కి ఇవ్వాలని కోరారు. శనివారం దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛత్తీస్గఢ్లో ఖనిజాలపై కేంద్రం అదనంగా వసూలు చేసిన రూ.4,170 కోట్లను ఇవ్వాలని డిమాండు చేశారు. ఈ విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. బొగ్గుతోపాటు ఇతర ఖనిజాలపై రాయల్టీ రేటును సవరించాలని కోరారు.
మోదీ నాయకత్వానికి ప్రపంచస్థాయి గుర్తింపు
ప్రధాని మోదీ తన తొమ్మిదేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు. రైతులూ సంతోషంగా ఉన్నారు. ఈ చర్యలన్నీ మోదీ నాయకత్వానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాయి.
రవిశంకర్ ప్రసాద్
దేశంలో మంచిరోజులు కనుమరుగు
మోదీ పాలనలో రాజకీయాలు విభజనకు గురయ్యాయి. మంచి రోజులు కనుమరుగయ్యాయి. ప్రతిపక్షాలను అణగదొక్కారు. కీలక నేతలను వేటాడారు. వ్యవస్థలను కబ్జా చేశారు. సమాజం ఛిద్రమైంది. ఇప్పుడు మనం 2024లో మార్పు కోసం ప్రార్థిద్దాం.
కపిల్ సిబల్
విద్యతో.. నిరుపేదల కలలు నెరవేరాలి
సమాజంలో మనం ఎక్కడున్నాం.. మన స్థానం ఏమిటో తెలియజేసేది విద్య ఒక్కటే. ప్రతి ఒక్కరికీ న్యాణమైన విద్య అందించాలి. నిరుపేదల కలలు నెరవేరేలా ఆయా ప్రభుత్వాలు వారికి అండగా నిలవాలి. ఇందుకు ప్రపంచ దేశాలు తమ వంతుగా తోడ్పాటునందించాలి.
ఆంటోనియో గుటెరస్
పొగాకు ఉత్పత్తులతో ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం లేదు
పొగాకు పండించడం ద్వారా మానవాళి ఆరోగ్యం దెబ్బతింటోంది. పైగా ఈ ఉత్పత్తులను పెంచడం మూలంగా ఆర్థిక వ్యవస్థకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. దీని దృష్ట్యా ఆకలితో అలమటిస్తున్న లక్షల మందికి ఆహారం అందించడం కోసమే నేలను వినియోగించాలి తప్ప పొగాకు కోసం కాదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు