రెజ్లర్లపై ఉక్కుపాదం
పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా మహిళల మహా పంచాయత్ పేరుతో ఆందోళనకు సిద్ధమైన రెజ్లర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో దిల్లీ పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి మరీ బస్సులో పడేశారు.
తీవ్రంగా తోపులాట, ఉద్రిక్తత
కన్నీరు పెట్టుకున్న వినేశ్ ఫొగాట్
జంతర్మంతర్లోని సామగ్రినీ తరలించిన పోలీసులు
దిల్లీ: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా మహిళల మహా పంచాయత్ పేరుతో ఆందోళనకు సిద్ధమైన రెజ్లర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో దిల్లీ పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి మరీ బస్సులో పడేశారు. చాలాకాలంగా జంతర్మంతర్వద్ద ఆందోళన చేస్తున్న వారు ఆదివారం ఆంక్షలను దాటుకుని పార్లమెంటువైపు బయలుదేరేందుకు సిద్ధంకాగా పోలీసులు అడ్డుకున్నారు. వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, బజ్రంగ్ పునియాలను బలవంతగా అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారినీ బస్సుల్లో ఎక్కించి వేర్వేరు చోట్లకు తరలించారు. ఆ వెంటనే జంతర్మంతర్ను పోలీసులు ఖాళీ చేయించారు.
తమను మానసికంగా, లైంగికంగా వేధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏప్రిల్ 23 నుంచి రెజ్లర్లు జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో పార్లమెంటు భవన ప్రారంభోత్సవం వద్ద ఆందోళన నిర్వహించాలని వారు నిర్ణయించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పార్లమెంటువైపు బయలుదేరిన రెజ్లర్లకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. వినేశ్, సంగీత, సాక్షి బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించే క్రమంలో తీవ్ర పెనుగులాట జరిగింది. వారిని పోలీసులు ఈడ్చుకెళ్లి బస్సులో ఎక్కించారు. మిగిలిన వారినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో వినేశ్ ఫొగాట్ కన్నీళ్లు పెట్టుకున్నారు. న్యాయం చేయాలని డిమాండు చేసినందుకు శిక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు బ్రిజ్భూషణ్ పార్లమెంటులో కూర్చున్నారని, దేశం కోసం పతకాలను సాధించిన తమను రోడ్లపై ఈడ్చుకెళ్లారని, ఇది భారత క్రీడారంగానికి చీకటి రోజని సాక్షి మలిక్ ధ్వజమెత్తారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళా రెజ్లర్లను సాయంత్రానికి విడుదల చేశారు. అయితే ఆందోళనకు దిగిన రెజ్లర్లు, వారితోపాటు ఉన్నవారిపై పోలీసులు కేసులు పెట్టారు. జంతర్మంతర్వద్ద ఆందోళనను కొనసాగిస్తామని, ఆపేది లేదని విడుదలైన అనంతరం సాక్షి మలిక్ స్పష్టం చేశారు. మరోవైపు మహిళా మహా పంచాయత్ పేరుతో ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హరియాణా, దిల్లీ సరిహద్దువద్ద పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దిల్లీకి బయలుదేరిన రైతు సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఘాజీపుర్వద్ద భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసు చర్యలపై ఖండన
రెజ్లర్లను అరెస్టు చేయడాన్ని పలువురు నేతలు, క్రీడాకారులు ఖండించారు. పట్టాభిషేకం అయిపోయిందని, దురహంకారి అయిన రాజు వీధుల్లో ప్రజల గొంతును నొక్కేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దీంతోపాటు పోలీసులు క్రీడాకారులను అరెస్టు చేస్తున్న వీడియోను ఆయన ట్విటర్లో ఉంచారు. ప్రజాస్వామ్యమనేది సహనానికి ప్రతీకని, కానీ అరాచక శక్తులు అసహనంతో వ్యతిరేకించిన వారిపై దాడులు చేస్తున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. క్రీడాకారులకు ఆమె మద్దతు ప్రకటించారు. పోలీసు చర్య ప్రభుత్వానికి సిగ్గుచేటని సీపీఎం వ్యాఖ్యానించింది. భారత్ క్రీడారంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది అవమానకరమని మాజీ క్రికెట్ క్రీడాకారుడు, తృణమూల్ ఎమ్మెల్యే మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. ఈ ఘటనను చూసి తాను చాలా బాధపడ్డానని, వారిని అడ్డుకోవడానికి ఇతర సరైన మార్గాలున్నాయని ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా అభిప్రాయపడ్డారు.
* బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలంటూ దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ దిల్లీ పోలీసు కమిషనరుకు లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే