కేసుల సుడిలో సెంట్రల్ విస్టా
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు సహా పార్లమెంటు నూతన భవనం గత కొన్ని సంవత్సరాలుగా పలు న్యాయ సవాళ్లను ఎదుర్కొన్నాయి.
పార్లమెంటు నూతన భవనం కూడా...
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు సహా పార్లమెంటు నూతన భవనం గత కొన్ని సంవత్సరాలుగా పలు న్యాయ సవాళ్లను ఎదుర్కొన్నాయి. 2019 సెప్టెంబరులో ప్రాజెక్టును ప్రకటించగా 2020, డిసెంబరు 10న పార్లమెంటు నూతన భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వీటికి సంబంధించిన కేసులన్నీ సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టుల్లో ఉన్నాయి. తాజాగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పార్లమెంటు కొత్త భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రారంభింపజేసేలా లోక్సభ సెక్రటేరియట్కు ఆదేశాలు జారీ చేయాలంటూ తమిళనాడుకు చెందిన న్యాయవాది జయ సుకిన్ వెకేషన్ బెంచ్ ముందుకు పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారించేందుకు జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం శుక్రవారం నిరాకరించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయడాన్ని రాజీవ్ సూరి, అంజు శ్రీవాస్తవలతో బాటు మరికొందరు తొలిసారి దిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. చివరకు సుప్రీం కోర్టుకు చేరిన ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. 2021లో కొవిడ్ మహమ్మారి రెండో దశ విజృంభణ సందర్భంగా ఆరోగ్యం, భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేస్తూ నిర్మాణ పనులు నిలిపేయాలంటూ అనన్య మల్హోత్రా, సొహైల్ హష్మీ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు వారి వాదనను తోసిపుచ్చి నిర్మాణపనులకు పచ్చజెండా ఊపింది. జాతీయ చిహ్నంలోని నాలుగు సింహాలు ఉగ్రంగా ఉన్నాయంటూ కొందరు పిటిషనర్లు, న్యాయవాది అల్దానీశ్ రెయిన్ సుప్రీంను ఆశ్రయించారు.
ఇక దృష్టి వీపీ ఎన్క్లేవ్పైనే
దిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పార్లమెంటు నూతన భవన నిర్మాణం విజయవంతంగా పూర్తి కావడంతో ఇక ఈ ప్రాజెక్టులోని ఇతర నిర్మాణాలపై దృష్టి మళ్లనుంది. వాటిలో వైస్ప్రెసిడెంట్ ఎన్క్లేవ్, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్స్, డిఫెన్స్ ఎన్క్లేవ్, ఎంపీల ఛాంబర్లు, ప్రధానమంత్రి కొత్త నివాసం, కార్యాలయం ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో తొలి నిర్మాణంగా గతంలో రాజ్పథ్గా వ్యవహరించిన కర్తవ్యపథ్ ఆధునికీకరణ పూర్తయింది. రెండోదైన పార్లమెంటు నూతన భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ నిర్మించింది. పీఎంవోకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ హౌసింగ్, కేబినెట్ సెక్రటేరియట్, ఇండియా హౌస్-నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ నిర్మాణాలను ఎల్ అండ్ టీ లిమిటెడ్ రూ.1189 కోట్ల అంచనా వ్యయంతో 2022 నవంబరులో చేపట్టింది. అప్పటి నుంచి 24 నెలల కాలంలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. అలాగే రూ.3,142 కోట్ల అంచనా వ్యయంతో అదే సంస్థ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్కు చెందిన మూడు భవనాలను నిర్మిస్తోంది. 2024 జూన్ నాటికి ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ (ఐజీఎన్సీఏ) కొత్త భవనాన్ని, 2026 డిసెంబరు నాటికి సెంట్రల్ కాన్ఫెరెన్స్ సెంటర్ నిర్మించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. 62.37% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!