ఉజ్జయిని మహాకాలేశ్వర్లో కూలిన విగ్రహాలు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయ ఆవరణలో ఆర్నెల్ల కిందట ప్రతిష్ఠించిన సప్తరుషుల విగ్రహాల్లో ఆరు విగ్రహాలు ఆదివారం సాయంత్రం ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి.
విచారణకు కాంగ్రెస్ డిమాండ్
ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయ ఆవరణలో ఆర్నెల్ల కిందట ప్రతిష్ఠించిన సప్తరుషుల విగ్రహాల్లో ఆరు విగ్రహాలు ఆదివారం సాయంత్రం ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి. ఒక్కో విగ్రహం పది అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఆ సమయంలో సందర్శకులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నా ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబరులో రూ.856 కోట్ల ఈ మహాకాల్ లోక్ కారిడార్ ప్రాజెక్టు మొదటిదశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణపనుల్లో జరిగిన అవినీతి కారణంగానే విగ్రహాలు కూలాయని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి విచారణ జరిపించాలని కోరుతూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమలనాథ్ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)