దిల్లీ చేరిన కంబోడియా రాజు
కంబోడియా రాజు నరోదమ్ సిహమోని మన దేశ పర్యటనకు గాను సోమవారం దిల్లీ చేరుకున్నారు. విదేశాంగ సహాయ మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్ ఆయనకు పాలం వాయు సేన స్థావరంలో ఘనంగా స్వాగతం చెప్పారు.
దిల్లీ: కంబోడియా రాజు నరోదమ్ సిహమోని మన దేశ పర్యటనకు గాను సోమవారం దిల్లీ చేరుకున్నారు. విదేశాంగ సహాయ మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్ ఆయనకు పాలం వాయు సేన స్థావరంలో ఘనంగా స్వాగతం చెప్పారు. 1952లో మొదలైన భారత్-కంబోడియా దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిహమోని భారత సందర్శనకు వచ్చారు. 1963లో సిహమోని తండ్రి నరోదమ్ సిహనౌక్ భారత్ను సందర్శించిన తరవాత కంబోడియా రాజు మళ్లీ భారత్కు రావడం ఇదే మొదటిసారి. మంగళవారం సిహమోనికి భారత రాష్ట్రపతి భవనంలో అధికార లాంఛనాలతో స్వాగతం పలుకుతారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీలతో ఆయన చర్చలు జరుపుతారు. ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ఖడ్, విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్లు కంబోడియా రాజును కలుసుకొంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్లో భారత హైకమిషనర్కు నిరసన సెగ.. గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డగింత
-
Chidambaram: మహిళా రిజర్వేషన్.. నీటిలో జాబిల్లి: కాంగ్రెస్ నేత చిదంబరం
-
ODI WC 2023: వరల్డ్ కప్ వారిదే.. ఫేవరెట్ టీమ్ చెప్పేసిన సునీల్ గావస్కర్
-
Smile Pinki: ఆస్కార్ విజేత పింకీ ఇంటికి కూల్చివేత నోటీసులు
-
Kantara: ‘కాంతార’కు ఏడాది.. నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్ట్
-
Vijayawada: విద్యార్థుల అరెస్ట్.. రణరంగంగా మారిన ధర్నా చౌక్