జీఎస్ఎల్వీ-ఎఫ్12 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రెండో తరం నావిక్ ఉపగ్రహ శ్రేణిలో మొదటిది అయిన ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
కక్ష్యలోకి చేరుకున్న ఎన్వీఎస్-01 ఉపగ్రహం
శ్రీహరికోట, న్యూస్టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రెండో తరం నావిక్ ఉపగ్రహ శ్రేణిలో మొదటిది అయిన ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం ఉదయం 10.42 గంటలకు ఉపగ్రహంతో కూడిన జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 19 నిమిషాల వ్యవధిలో 2,232 కిలోల బరువు గల ఎస్వీఎస్-01(ఐఆర్ఎన్ఎస్ఎస్-జే)ను 251 కి.మీ.ల ఎత్తులో నిర్దేశిత కక్ష్యలో ఉంచింది. అనంతరం ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో అధిపతి డా.సోమనాథ్ ప్రకటించారు. జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగంలో క్రయోజనిక్ దశలో సమస్య తలెత్తడంతో దిద్దుబాట్లు, మార్పులు చేసి, జీఎస్ఎల్వీ-ఎఫ్12 ప్రయోగాన్ని విజయవంతం చేశామని తెలిపారు.
* ఎన్వీఎస్-01 ఉపగ్రహం ఎల్1, ఎల్5, ఎస్ బ్యాండ్లలో పనిచేసే నావిగేషన్ పేలోడ్లను కలిగి ఉంది. ఉపగ్రహం రెండు సౌర పలకల శ్రేణుల ద్వారా శక్తిని పొందుతుంది. తద్వారా 12 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఇది పని చేయనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన రుబిడియం అటామిక్ క్లాక్ను ఉపగ్రహంలో అమర్చారు. వైమానిక సేవలు, నావిగేషన్, వ్యవసాయం, సర్వేయింగ్, అత్యవసర సేవలు, సముద్ర చేపల పెంపకం మొదలైన రంగాలకు ఈ ఉపగ్రహం నిర్దిష్టమైన సమాచారాన్ని అందిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
విడిభాగాలు అందించిన అనంత్ టెక్నాలజీస్
ఈనాడు, హైదరాబాద్: ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ- ఎఫ్ 12 రాకెట్కు, ఎన్వీఎస్-01 ఉపగ్రహ తయారీకి తాము కీలక విడిభాగాలు అందించినట్లు అనంత్ టెక్నాలజీస్ వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ.. జీఎస్ఎల్వీ - ఎఫ్ 12కు అవసరమైన ఐఎన్ఎస్ సిస్టమ్స్, టెలిమెట్రీ ప్యాకేజీలైన డీఏయూ-1, డీఏయూ-2, సీ-ట్యాక్స్, పవర్ స్విచింగ్ మాడ్యూల్స్, సేఫ్ ఆర్మ్ రిలే యూనిట్లు, స్ట్రెయిన్ గేజ్ బ్యాలెన్సింగ్ యూనిట్లు సరఫరా చేసినట్లు వివరించింది. ఈ సంస్థకు చెందిన బెెంగళూరు యూనిట్ నుంచి ఎన్వీఎస్-01కు సంబంధించి టెలిమెట్రీ, పవర్, సెన్సార్స్.. తదితర శాటిలైట్ సిస్టంలు అందించినట్లు పేర్కొంది. అనంత్ టెక్నాలజీస్ సీఎండీ డాక్టర్ సుబ్బారావు పావులూరి స్పందిస్తూ.. తాము సరఫరా చేసిన సిస్టమ్, ప్యాకేజ్లు సమర్థంగా పనిచేశాయని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.